Tokyo Olympics: ఒలింపిక్స్‌లో పతకం సాధించే పోటీదారులలో భారత హాకీ జట్టు ఒకటి: వెటరన్ కోచ్ రోలెంట్ ఓల్ట్‌మన్స్

జులై-ఆగస్టులో జరగబోయే టోక్యో ఒలింపిక్స్‌ లో పతకం కోసం పోటీ పడే దేశాల్లో భారత పురుషుల హాకీ జట్టు తప్పకుండా ఉంటుందని మాజీ కోచ్ రోలెంట్ ఓల్ట్‌మన్స్‌ ధీమా వ్యక్తం చేశారు.

Tokyo Olympics: ఒలింపిక్స్‌లో పతకం సాధించే పోటీదారులలో భారత హాకీ జట్టు ఒకటి: వెటరన్ కోచ్ రోలెంట్ ఓల్ట్‌మన్స్
Tokyo Olympics
Follow us

|

Updated on: Jun 16, 2021 | 5:18 PM

Tokyo Olympics: జులై-ఆగస్టులో జరగబోయే టోక్యో ఒలింపిక్స్‌ లో పతకం కోసం పోటీ పడే దేశాల్లో భారత పురుషుల హాకీ జట్టు తప్పకుండా ఉంటుందని మాజీ కోచ్ రోలెంట్ ఓల్ట్‌మన్స్‌ ధీమా వ్యక్తం చేశారు. ఒలింపిక్స్‌కు ముందు హాకీ ఇండియా ప్రారంభించిన పోడ్‌కాస్ట్ సిరీస్‌ ‘హాకీ టే చర్చా’ కార్యక్రమంలో ఆయన పాల్గొని పై విధంగా పేర్కొన్నారు. అలాగే టోక్యోలో ఏ జట్టైనా విజయం సాధించేందుకు అవకాశం ఉందని, ఇందుకోసం వారు మానసికంగా ధృడంగా ఉండాలని పేర్కొన్నారు. “టోక్యోలో పతకం సాధించేందుకు పోటీ పడే మొదటి ఐదు దేశాల్లో భారతదేశం ఉంటుంది. గత రెండేళ్లుగా ప్రపంచంలోని అత్యుత్తమ జట్లతో పోటీపడుతోంది. ప్రస్తుతం ఈ జట్టు మంచి నిలకడను ప్రదర్శిస్తోంది” అని ఆయన పేర్కొన్నారు. ఒత్తిడి కారణంగా అనవసరమైన భయాందోళనలకు గురయ్యే అవకాశం ఉందని, మ్యాచ్‌కు ముందు ప్రశాంతంగా ఉండాలని ఆటగాళ్లకు సూచించాడు. “ఆస్ట్రేలియా, బెల్జియం, నెదర్లాండ్స్ వంటి జట్లను ఓడించే సత్తా భారత్ కు ఉందని ఇప్పటికే రుజువైంది. అయితే, ఒలింపిక్స్‌లో ఆయా దేశాలను ఓడించడంపై సమాలోచనలు చేయాలని’ ఆయన పేర్కొన్నారు.

ఆటలో ప్రతీక్షణం చాలా ముఖ్యమని, ఆటలో వెనుకపడితే ముందుకు వెళ్లలేరు. అందుకే ప్రతీ పరిస్థితిని అదుపులో ఉంచుకోవాలని ఆయన కోరారు. టోక్యోలోని వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని, త్వరగా అక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఇతర దేశాలతో పోల్చితే వాతావరణ పరిస్థితులు భారతదేశానికి ఎంతో అనుకూలంగా ఉంటాయని ఆయన వెల్లడించాడు. 2016 రియో ​​ఒలింపిక్స్‌లో భారత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నప్పుడు ఓల్ట్‌మన్స్ ప్రధాన కోచ్‌గా ఉన్నారు. అప్పటి నుంచి జట్టు బాగా రాణిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, 1980 నుంచి భారతదేశం హాకీలో ఒలింపిక్ పతకం సాధించలేదు.

Also Read:

Tokyo Olympics: భారతదేశ తొలి ‘స్కేటర్‌ గర్ల్‌’… అతితా వర్గీస్! నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతోన్న ఆమె స్ఫూర్తి గాధ!

Olympic Games: సమ్మర్ ఒలింపిక్స్‌ మొత్తం పతకాల్లో భారత్ గెలిచింది కేవలం 0.17 శాతమే!

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు