Olympic Games: సమ్మర్ ఒలింపిక్స్‌ మొత్తం పతకాల్లో భారత్ గెలిచింది కేవలం 0.17 శాతమే!

1896 నుంచి 2016 వరకు జరిగిన ఒలింపిక్ క్రీడల్లో మొత్తం 15,683 పతకాలలో భారతదేశం కేవలం 28 మాత్రమే గెలుచుకుంది. మరో రెండు దేశాలతో కలిసి 53వ స్థానంలో కొనసాగుతోంది.

Olympic Games: సమ్మర్ ఒలింపిక్స్‌ మొత్తం పతకాల్లో భారత్ గెలిచింది కేవలం 0.17 శాతమే!
Olympics
Follow us

|

Updated on: Jun 16, 2021 | 3:57 PM

Olympic Games: 1896 నుంచి 2016 వరకు జరిగిన ఒలింపిక్ క్రీడలలో మొత్తం 15,683 పతకాలలో భారతదేశం 28 పతకాలు సాధించింది. మరో రెండు దేశాలతో కలిసి 53వ స్థానంలో కొనసాగుతోంది. ఒలింపిక్ క్రీడల్లో గెలిచిన విజేతకు బంగారు పతకం, రన్నర్‌ గా నిలిచిన వారికి రజత పతకం, అలాగే మూడో స్థానంలో నిలిచిన వారికి కాంస్య పతకం అందిస్తారని మనందరికీ తెలిసిందే. 1896లో గ్రీస్‌లోని ఏథెన్స్‌లో ఆధునిక ఒలింపిక్ క్రీడలు మొదలయ్యాయి. పతకాలు ఇవ్వడం కూడా ఈ ఏడాది నుంచే ప్రారంభమైంది. కానీ, తొలిసారి జరిగిన ఒలింపిక్స్‌ లో విజేతలకు బంగారు పతకాలను ఇవ్వలేదు. బంగారు పతకాలకు బదులు రజత పతకంతోపాటు ఆలివ్ కొమ్మల దండను బహుమతిగా ఇచ్చేవారు. అలాగే రన్నర్లకు కాంస్య లేదా రాగి పతకాలతోపాటు లారెల్ దండలను అందించేవారు. అనంతరం 1900వ సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్‌లో చాలామంది విజేతలకు పతకాలకు బదులు కప్పులు, ట్రోపీలను అందించారు.

ఇక 1904వ సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్‌లోని మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌ నుంచి బంగారు, వెండి, కాంస్య పతకాలను అందించడం ప్రారంభించారు. ఈమేరకు మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి ఈ పతకాలను ఇచ్చేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఈ ఏడాదే నిర్ణయించింది. కాగా, 1896, 1900 ఒలింపిక్స్ లో ఉత్తమంగా నిలిచిన వారికి కూడా మరలా బంగారు, రజతం, కాంస్య పతకాలు అందించారు.

మొదటి మూడు స్థానాల్లో దైనికైనా టై ఏర్పడితే.. ఐఓసీ నిబంధనల మేరకు మిగతా వారికి కూడా పతకం పొందే అర్హత లభిస్తుంది. ఇదే రూల్‌ను మరికొన్ని క్రీడలు.. బాక్సింగ్, జూడో, టైక్వాండ్, కుస్తీ వంటి పోటీల్లో కూడా పాటించడం మనకు తెలిసిందే. ఇలాంటి టై అయిన సందర్భంలో కాంస్య పతకాన్ని వారికి అందిస్తారు. ఫలితంగా మిగతా పతకాల కంటే కాంస్య పతకాలు ఎక్కువగా లభిస్తాయన్నమాట.

కాగా, 1896 ఏథెన్స్ నుంచి 2016 రియో ​​ఒలింపిక్ క్రీడల వరకు సమ్మర్ గేమ్స్‌లో మొత్తం 15,683 పతకాలు వివిధ దేశాలు సాధించాయి. ఇందులో 5,116 బంగారం, 5,080 రజతం, 5,487 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాలు ఇంత పెద్ద మొత్లంలో ఉన్నా.. ఒలింపిక్స్‌లో మనదేశం ఇప్పటివరకు కేవలం 28 పతకాలను మాత్రమే గెలుచుకుంది. ఇందులో 9 బంగారు, 7 రజత, 12 కాంస్య పతకాలు ఉన్నాయి. మొత్తం పతకాలలో భారత అథ్లెట్స్‌ గెలుపొందిన పతకాలు కేవలం 0.17 శాతం మాత్రమే. యూఎస్‌ఏ మొత్తం 2,523 పతకాలతో మొదటి స్థానంలో నిలిచింది. అలాగే చైనా 546 పతకాలను సాధించి ఐదో స్థానంలో నిలిచింది.

ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటివరకు గెలిచిన 28 పతకాలలో.. 11 పతకాలు హాకీ నుంచి గెలుపొందగా, కుస్తీ నుంచి 5, షూటింగ్‌ నుంచి 4, బ్యాడ్మింటన్‌లో 2, స్వాతంత్య్రానికి పూర్వం నార్మన్ ప్రిట్ చార్డ్ అనే అథ్లెట్ (200 మీటర్ల పరుగు పందెం) తో 2 పతకాలు, టెన్నిస్‌లో 1, వెయిట్ లిఫ్టింగ్‌ నుంచి 1 పతకం లభించాయి. మరోవైపు టోక్యోలో ఈ ఏడాది జులై 23 నుంచి ఒలింపిక్స్‌ జరగనున్నాయి.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు