AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Olympics 2036 : అంత ఈజీ కాదు బాబూ…ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం ఇండియా చేయాల్సిన పని ఇదే!

భారత్ 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి దరఖాస్తు సమర్పించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ కూడా అహ్మదాబాద్‌లో కామన్వెల్త్ గేమ్స్‌ నిర్వహణకు ఆమోదం తెలిపింది. ఈ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 31. కామన్వెల్త్ గేమ్స్ తర్వాత, భారత్ 2036 ఒలింపిక్స్‌కు కూడా ఆతిథ్యం ఇవ్వాలనుకుంటోంది.

Olympics 2036 : అంత ఈజీ కాదు బాబూ...ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం ఇండియా చేయాల్సిన పని ఇదే!
Olympics 2036
Rakesh
|

Updated on: Aug 30, 2025 | 2:39 PM

Share

Olympics 2036 : భారత్ 2030లో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ అహ్మదాబాద్‌లో ఈ క్రీడలను నిర్వహించడానికి ఆమోదం తెలిపింది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 31. కామన్వెల్త్ గేమ్స్ తర్వాత, భారత్ 2036 ఒలింపిక్స్ క్రీడలకు కూడా ఆతిథ్యం ఇవ్వాలని కోరుకుంటోంది. 2024 ఒలింపిక్స్ పారిస్‌లో జరిగాయి. 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజిల్స్‌లో జరుగుతాయి. మరి భారత్‌కు ఒలింపిక్స్ ఆతిథ్యం ఎలా లభిస్తుంది? ఆ కంప్లీట్ ప్రాసెస్ ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

ఒలింపిక్స్ ఆతిథ్యం పొందే ప్రక్రియ

స్టెప్ 1:

ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలని ఏ దేశం కోరుకుంటుందో, ఆ దేశంలోని జాతీయ ఒలింపిక్ కమిటీ (NOC), ఐఓసీ (IOC) మధ్య క్రీడల గురించి సమాచారం ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ సమావేశంలో ఒలింపిక్స్ నిర్వహించాల్సిన నగరం లేదా ప్రాంతం గురించి చర్చిస్తారు.

స్టెప్ 2:

మొదటి దశ పూర్తయిన తర్వాత NOC ఐఓసీతో నిరంతరం సంప్రదింపులు చేస్తుంటుంది. ఒలింపిక్స్ ప్రాజెక్ట్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం చేసుకుంటుంది. ఐఓసీ ఆతిథ్యం ఇవ్వబోయే దేశానికి గేమ్స్ ప్లాన్‌ను ఎలా రూపొందించాలో చెబుతుంది. ఈ కార్యక్రమం వల్ల ఆ నగరంలోని ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో కూడా వివరిస్తుంది.

స్టెప్ 3:

అన్నీ సరైన దిశలో ఉన్నాయని ఐఓసీ భావించినప్పుడు, ఎగ్జిక్యూటివ్ బోర్డు టార్గెటెడ్ డైలాగ్ కోసం మాటలు మొదలుపెడుతుంది. ఆ సంవత్సరం ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం ఆసక్తి చూపిన అన్ని దేశాలను ఈ తదుపరి దశ చర్చల కోసం ఆహ్వానిస్తారు. ఇందులో ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ ముందుకు వెళ్తుంది. టార్గెటెడ్ డైలాగ్‌లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రాజెక్ట్‌లపై చర్చిస్తారు. ఈ దశలో వేదికల ఖర్చు, ప్రజల అభిప్రాయం, పర్యావరణ ప్రభావం గురించి ఐఓసీ చర్చిస్తుంది.

స్టెప్ 4:

ఒక ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం ఒకటి కంటే ఎక్కువ దేశాలు పోటీపడినప్పుడు, ఎగ్జిక్యూటివ్ బోర్డు ఒక ఎన్నికను ప్రకటిస్తుంది. ఇందులో ఆతిథ్యం ఇవ్వాలని కోరుకుంటున్న దేశాలు తమ ప్రాజెక్ట్‌లను సమర్పిస్తాయి. ఈ ప్రాజెక్ట్‌లను ఐఓసీ సభ్యులతో పంచుకుంటారు. చివరిగా ఐఓసీ సెషన్‌లో తుది ప్రెజెంటేషన్ ఇస్తారు. ఆ తర్వాత, ఐఓసీ సభ్యులు రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ చేస్తారు. ఈ ఓటింగ్‌లో ఏ దేశం గెలిస్తే, ఆ దేశంతో ఐఓసీ ఒలింపిక్ హోస్ట్ కాంట్రాక్ట్‌ను సంతకం చేస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..