AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Games 2023: షూటింగ్‌లో స్వర్ణం, రజతంతో సత్తా చాటిన భారత్.. 4వ రోజు ఎన్ని పతకాలు వచ్చాయంటే?

Asian Games 2023 Day 4: షూటింగ్‌లో 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో సిఫ్ట్ కౌర్ సమ్రా, మణిని కౌశిక్, ఆషి చోక్సీ రజత పతకాన్ని గెలుచుకోవడం ద్వారా భారతదేశం 4వ రోజును ప్రారంభించింది. ఆ తర్వాత, 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో మను భాకర్, ఇషా సింగ్, రిథమ్ సాంగ్వాన్‌లతో కూడిన భారత జట్టు బంగారు పతకాన్ని గెలుచుకుంది. 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన సిఫ్ట్ కౌర్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. సెయిలింగ్‌లో భారత ఆటగాడు విష్ణు శరవణన్ అద్భుత ప్రదర్శన చేసి పురుషుల ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించాడు.

Asian Games 2023: షూటింగ్‌లో స్వర్ణం, రజతంతో సత్తా చాటిన భారత్.. 4వ రోజు ఎన్ని పతకాలు వచ్చాయంటే?
India Asian Games 2023
Venkata Chari
|

Updated on: Sep 28, 2023 | 5:38 AM

Share

Asian Games 2023: చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో నాలుగో రోజు భారత్ మొత్తం 8 పతకాలు సాధించింది. దీంతో మొత్తం పతకాల సంఖ్య 22కి చేరుకుంది. భారత్ సాధించిన 8 పతకాల్లో 2 బంగారు, 3 రజత, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. అంతకుముందు, మొదటి 3 రోజుల ఆటలో భారత్ 14 పతకాలు సాధించింది. నాలుగో రోజు షూటింగ్‌లో భారత్‌కు అత్యధిక పతకాలు వచ్చాయి. ఇందులో బంగారు పతకం కూడా ఉంది. భారత్ ఇప్పటి వరకు 5 స్వర్ణాలు, 7 రజతాలు, 10 కాంస్య పతకాలు సాధించింది. ఆసియా క్రీడల్లో 76 బంగారు పతకాలతో కలిపి ఇప్పటివరకు మొత్తం 140 పతకాలు సాధించిన చైనా పతకాల పరంగా మొదటి స్థానంలో ఉంది.

షూటింగ్‌లో 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో సిఫ్ట్ కౌర్ సమ్రా, మణిని కౌశిక్, ఆషి చోక్సీ రజత పతకాన్ని గెలుచుకోవడం ద్వారా భారతదేశం 4వ రోజును ప్రారంభించింది. ఆ తర్వాత, 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో మను భాకర్, ఇషా సింగ్, రిథమ్ సాంగ్వాన్‌లతో కూడిన భారత జట్టు బంగారు పతకాన్ని గెలుచుకుంది. 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన సిఫ్ట్ కౌర్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

స్కీట్ షూటింగ్ పురుషుల టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన అంగద్ వీర్ సింగ్ బజ్వా, అనంత్‌జిత్ సింగ్, గుర్జోత్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఇషా సింగ్ రజత పతకాన్ని గెలుచుకుంది. స్కీట్ పురుషుల వ్యక్తిగత ఈవెంట్‌లో అనంతజిత్ సింగ్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు.

సెయిలింగ్‌లో భారత ఆటగాడు విష్ణు శరవణన్ అద్భుత ప్రదర్శన చేసి పురుషుల ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించాడు.

భారత ఈక్వెస్ట్రియన్లు హృదయ్ ఛేడా, అన్షు అగర్వాల్ వ్యక్తిగత ఈవెంట్‌లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్స్‌లో తమ స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. అంతకుముందు, గుర్రపు స్వారీ జట్టు సెప్టెంబర్ 26న బంగారు పతకాన్ని గెలుచుకుంది.

వుషులో భారతదేశానికి చెందిన రోషిబినా దేవి తన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేయడం ద్వారా స్వర్ణం మ్యాచ్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. ఇప్పుడు సెప్టెంబర్ 28న చైనా క్రీడాకారిణితో తలపడనుంది.

మహిళల హాకీ జట్టు కూడా విజయంతో ప్రారంభించి తొలి మ్యాచ్‌లోనే భారీ విజయాన్ని నమోదు చేసింది. సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 13-0తో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సంగీత కుమారి 3 గోల్స్ చేయగా, నవనీత్ కౌర్ 2 గోల్స్ చేసింది.

ఈ ఆటలలో తప్పని నిరాశ..

భారత్ కూడా కొన్ని ఈవెంట్లలో ఓటమిని చవిచూసింది. ఇందులో బాక్సింగ్ రౌండ్-16లో 57 కేజీల విభాగంలో శివ్ థాపా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. పురుషుల 92 కేజీల బరువు విభాగంలో సంజీత్ కూడా రౌండ్ ఆఫ్ 16లో ఓడి నిష్క్రమించాడు. స్క్వాష్‌లోని టీమ్ ఈవెంట్‌లో, భారత పురుషుల జట్టు పాకిస్తాన్‌తో 1-2 తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కాగా, హ్యాండ్‌బాల్‌లో హాంకాంగ్‌పై భారత్ 26-26తో డ్రాగా ఆడింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు