AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: అండర్ 19లో అదరగొట్టిన టీమిండియా.. ప్రపంచకప్‌లో భారీ రికార్డ్.. తొలి జట్టుగా..

U19 Womens T20 World Cup: మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో భారత్, యూఏఈ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ప్రపంచకప్ చరిత్రలోనే అతిపెద్ద స్కోరు నమోదు చేసింది.

Team India: అండర్ 19లో అదరగొట్టిన టీమిండియా.. ప్రపంచకప్‌లో భారీ రికార్డ్.. తొలి జట్టుగా..
U19 Womens World Cup
Venkata Chari
|

Updated on: Jan 16, 2023 | 9:01 PM

Share

సౌతాఫ్రికాలో జరుగుతోన్న మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ (U19 Womens T20 World Cup)లో భారత జట్టు అద్భుతమైన ఫాంలో కనిపిస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో జరిగిన రెండో మ్యాచ్‌లో ఆ జట్టు 122 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించిన యూఏఈ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 97 పరుగులు మాత్రమే చేయగలిగింది.

భారత జట్టు సరికొత్త రికార్డు..

ఈ మ్యాచ్‌లో టీమిండియా 219 పరుగులు చేసింది. మహిళల అండర్-19 టీ20 ప్రపంచ చరిత్రలో 200 పరుగుల మార్కును దాటిన తొలి జట్టుగా భారత జట్టు నిలిచింది. ఈ ప్రపంచకప్‌లో ఏ జట్టు అయినా ఇంత పెద్ద స్కోర్ చేయడం ఇదే తొలిసారి. భారత జట్టు తన పేరిట ఓ గొప్ప రికార్డు సృష్టించింది.

తుఫాన్ వేగంలో బ్యాటింగ్..

శ్వేతా సెహ్రావత్, కెప్టెన్ షెఫాలీ వర్మ, రిచా ఘోష్ భారత జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ మ్యాచ్‌లో షెఫాలీ వర్మ 229.41 స్ట్రైక్ రేట్‌తో 34 బంతుల్లో 78 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఆమె ఇన్నింగ్స్‌లో మొత్తం 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టైటిల్‌ను అందుకుంది.

ఇవి కూడా చదవండి

ఇది కాకుండా ఓపెనర్ శ్వేతా సెహ్రావత్ 49 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 74 పరుగులు చేసింది. ఈ సమయంలో ఆమె స్ట్రైక్ రేట్ 151.02గా నిలిచింది. అదే సమయంలో వికెట్ కీపర్ రిచా ఘోష్ కూడా 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 49 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఈ ఇన్నింగ్స్‌లో అతని స్ట్రైక్ రేట్ 168.97గా నిలిచింది.

ప్రపంచకప్‌లో భారత జట్టు రెండో విజయం..

ఈ అండర్-19 ప్రపంచకప్‌లో మహిళల భారత జట్టు ఇప్పటివరకు మొత్తం 2 మ్యాచ్‌లు ఆడింది. రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు విజయం సాధించింది. భారత జట్టు దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అదే సమయంలో యూఏఈపై ఆ జట్టు 122 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..