AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధమైన భారత్.. 18న తొలి మ్యాచ్.. హైదరాబాద్‌లో రోహిత్ సేన రికార్డులు ఇవే..

India vs New Zealand: జనవరి 18 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ హైదరాబాద్‌లో జరగనుంది. ఇక్కడ భారత్ చివరి 3 వన్డేల్లో విజయం సాధించింది.

IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధమైన భారత్.. 18న తొలి మ్యాచ్.. హైదరాబాద్‌లో రోహిత్ సేన రికార్డులు ఇవే..
India Vs New Zealand
Venkata Chari
|

Updated on: Jan 16, 2023 | 8:20 PM

Share

భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ జనవరి 18 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ హైదరాబాద్‌లో జరగనుంది. ఇప్పటి వరకు భారత్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియాదే పైచేయిగా నిలిచింది. న్యూజిలాండ్ జట్టు చివరిసారిగా 2017లో వన్డే సిరీస్ కోసం భారత్‌కు వచ్చింది. ఈ సిరీస్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి ఇరు జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. ఈ సిరీస్‌కు ముందు కొన్ని ఆసక్తికరమైన గణాంకాలను తెలుసుకుందాం..

భారత్‌లో ఇప్పటివరకు టీమిండియా, న్యూజిలాండ్ మధ్య మొత్తం 35 వన్డేలు జరగాయి. ఈ సమయంలో న్యూజిలాండ్ 8 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. కాగా, టీమిండియా 26 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అక్కడ ఒక మ్యాచ్ రద్దయింది. అందుకు తగ్గట్టుగానే సొంతగడ్డపై భారత్‌పై అతడిదే పైచేయిగా నిలిచింది. న్యూజిలాండ్ జట్టు చివరిసారిగా 2017లో భారత్‌లో వన్డే సిరీస్ ఆడింది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-2తో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో భారత్ ఇప్పటివరకు 6 వన్డేలు ఆడగా, ఈ కాలంలో మూడు మ్యాచ్‌లు గెలిచింది. టీమిండియా కూడా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇక్కడ జరిగిన తొలి మూడు మ్యాచ్‌ల్లో టీమిండియా ఓటమి చవిచూసింది. రెండుసార్లు ఆస్ట్రేలియా చేతిలో, ఒకసారి దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. కాగా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, శ్రీలంకలను భారత్ ఇక్కడ ఒకసారి ఓడించింది. ఈ మైదానంలో న్యూజిలాండ్ జట్టు తొలిసారి వన్డే ఆడనుంది.

ఇవి కూడా చదవండి

జనవరి 18న హైదరాబాద్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ తొలి మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత రెండో మ్యాచ్‌ రాయ్‌పూర్‌లో జనవరి 21న జరగనుంది. అదే సమయంలో సిరీస్‌లోని చివరి మ్యాచ్ జనవరి 24న ఇండోర్‌లో జరగనుంది. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కూడా జరగనుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..