Virat Kohli: లాహోర్ వీధుల్లో కోహ్లీ పోస్టర్లు.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే పాకిస్తాన్లో రచ్చ మాములుగా లేదుగా
Virat Kohli Posters in Pakistan Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వచ్చే నెల ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. దీని ఫైనల్ మ్యాచ్ మార్చి 9న జరగనుంది. ఈసారి ఈ టోర్నీ పాకిస్థాన్ ఆతిథ్యమిస్తోన్న 'హైబ్రిడ్ మోడల్'లో ఆడనుంది. ఈ పోటీలు పాకిస్థాన్లోని మూడు నగరాల్లో (కరాచీ, రావల్పిండి, లాహోర్) దుబాయ్లో జరుగుతాయి.

Virat Kohli Champions Trophy Posters Pakistan: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వచ్చే నెల నుంచి పాకిస్థాన్లో జరగనుంది. టోర్నీలో క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ భారత్-పాక్ మ్యాచ్. అయితే వీటన్నింటికీ ముందు విరాట్ కోహ్లీ వార్తల్లో నిలిచాడు. ఇందులో పెద్ద విషయం ఏంటంటే.. కోహ్లి భారత్లోనే కాదు పాకిస్థాన్లో కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. వాస్తవానికి, ఆతిథ్య పాకిస్థాన్లోని నగరాలు, వీధుల్లో విరాట్ కోహ్లీ పోస్టర్లు వెలిశాయి. ఇవి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రచార పోస్టర్లు, వీటిని స్థానిక ప్రసారకర్త తప్మాడ్ ఏర్పాటు చేసింది. ఈ పోస్టర్లను ఓ పాకిస్థానీ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
లాహోర్ వీధుల్లో కోహ్లీ పోస్టర్లు..
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రమోషనల్ పోస్టర్లో విరాట్ కోహ్లీతో పాటు ఇతర జట్ల స్టార్ ఆటగాళ్ల ఫొటోలు కూడా ఉన్నాయి. అయితే మధ్యలో కోహ్లిని పెద్దగా చూపించారు. ఇందులో విశేషమేమిటంటే.. భారత జట్టుకు కోహ్లీ కెప్టెన్ కాకపోవడం గమానార్హం. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత కెప్టెన్సీని రోహిత్ శర్మ నిర్వహించనున్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రమోషనల్ పోస్టర్లో కోహ్లీ పోస్టర్ను చేర్చడానికి పెద్ద కారణం ఏమిటంటే, అతనికి పాకిస్తాన్లో చాలా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పాకిస్థానీయులకు కోహ్లీ అంటే చాలా ఇష్టం. ఇటువంటి పరిస్థితిలో, ప్రసారకులు దీనిని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు. లాహోర్ వీధుల్లో కూడా కోహ్లీకి సంబంధించిన పోస్టర్లు వేయడానికి కారణం ఇదే.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం..
🚨 TAPMAD BILLBOARDS IN LAHORE FOR CHAMPIONS TROPHY & PSL
King Kohli on the streets in Lahore. Tapmad is officially showing 2025 Champions Trophy & HBL PSL 10 in Pakistan. What a news for cricket fans 🇵🇰🇮🇳❤️❤️❤️ pic.twitter.com/QMeo3h0ZZF
— Farid Khan (@_FaridKhan) January 29, 2025
ఐసీస ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వచ్చే నెల 19 ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతుంది. ఆ ఫైనల్ మ్యాచ్ మార్చి 9న జరగనుంది. ఈసారి ఈ టోర్నీ పాకిస్థాన్ ఆతిథ్యమిస్తోన్న ‘హైబ్రిడ్ మోడల్’లో ఆడనుంది. దీని పోటీలు పాకిస్థాన్లోని మూడు నగరాల్లో (కరాచీ, రావల్పిండి, లాహోర్), దుబాయ్లో జరుగుతాయి.
భారత జట్టు తన అన్ని మ్యాచ్లను దుబాయ్లో ఆడనుంది. ఇక్కడ సెమీ ఫైనల్ కూడా జరగనుంది. ఒకవేళ భారత జట్టు ఫైనల్ చేరితే.. ఈ టైటిల్ మ్యాచ్ కూడా దుబాయ్లోనే జరగనుంది. కాకపోతే, లాహోర్లో షెడ్యూల్ చేస్తారు. టోర్నీ ప్రారంభ మ్యాచ్ కరాచీలో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. భారత జట్టు ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తొలి మ్యాచ్ ఆడనుంది.
మరిన్న క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..