Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీమిండియాకు గుడ్ న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే బిగ్ స్కెచ్ వేసిన బీసీసీఐ

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడనుంది. బంగ్లాదేశ్ లేదా UAEతో ఈ మ్యాచ్ జరగవచ్చు. దుబాయ్‌లో జరిగే టోర్నీకి ముందు, స్థానిక పరిస్థితులకు అలవాటు పడటానికి ఈ మ్యాచ్ ముఖ్యం. బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్ దుబాయ్‌లోనే ఆడనుండటంతో వారితోనే మ్యాచ్ జరిగే అవకాశం ఎక్కువ.

టీమిండియాకు గుడ్ న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే బిగ్ స్కెచ్ వేసిన బీసీసీఐ
Team India
Follow us
Venkata Chari

|

Updated on: Jan 27, 2025 | 5:32 PM

Team India’s Warm Up Match: ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా, పొరుగు దేశం (పాకిస్థాన్) డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. గతసారి ఫైనల్‌లో కోహ్లీ సారథ్యంలో భారత్ ఓడిపోయినా.. ఈసారి రోహిత్ శర్మ సేన టైటిల్ గెలవాలని కోరుకుంటోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన ప్రచారాన్ని ఫిబ్రవరి 20న ప్రారంభించనుంది. అయితే, ఇప్పుడు టోర్నీ ప్రారంభానికి ముందు టీమిండియా వార్మప్ మ్యాచ్ కూడా ఆడనుందని సమాచారం. హైబ్రిడ్ మోడల్‌లో జరగనున్న ఈ టోర్నీకి ముందు భారత్ ఇంగ్లండ్‌తో 3 వన్డేలు మాత్రమే ఆడాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితిలో తన సన్నాహాలను బలోపేతం చేయడానికి, భారత్ వార్మప్ మ్యాచ్‌ని ఎంచుకుంది.

భారత్ వార్మప్ మ్యాచ్ ఏ జట్టుతో ఆడనుందంటే..

మీడియా కథనాల ప్రకారం, ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు భారత జట్టు వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఇందులో బంగ్లాదేశ్ లేదా యూఏఈ జట్టుతో తలపడవచ్చు అని తెలుస్తోంది. అయితే, మొదటి ప్రయత్నం బంగ్లాదేశ్‌తో ఆడాల్సి ఉంటుంది. వర్కవుట్ కాకపోతే, టీమ్ ఇండియా తన ప్రాక్టీస్ మ్యాచ్‌ను యూఏఈతో ఆడుతుంది. దుబాయ్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ అన్ని మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కాబట్టి, అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా వార్మప్ మ్యాచ్‌లు ఆడాలని టీమిండియా చూస్తోంది. అయితే దీని తేదీ ఇంకా ఖరారు కాలేదు.

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన తొలి మ్యాచ్‌ని ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ఆడాల్సి ఉంది. ఈ కారణంగా బంగ్లాదేశ్ జట్టు దుబాయ్‌లోనే ఉంటుంది. మిగతా జట్లన్నీ పాకిస్థాన్‌లో ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌తో చర్చలు కుదరకపోతే ఆతిథ్య యూఏఈ జట్టు కూడా ఉంటుంది. UAE ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేదు. కానీ, స్వదేశీ జట్టుగా బరిలోకి దిగనుంది. మరి భారత్ ఏ జట్టుతో వార్మప్ మ్యాచ్ ఆడుతుందో చూడాలి.

ఛాంపియన్స్ ట్రోఫీకి టీం ఇండియా జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..