AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: కోహ్లీని ట్రోల్ చేసిన ఇంగ్లండ్.. మైదానంలో ఆ సిగ్నల్ ఇచ్చినందుకేనా? ఫైరవుతోన్న ఫ్యాన్స్..

ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో విరాట్ కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలం కావడంతో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో సిరీస్ 2-2తో సమమైంది. మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీని ఇంగ్లాండ్ క్రికెట్ ట్రోల్ చేసింది.

Virat Kohli: కోహ్లీని ట్రోల్ చేసిన ఇంగ్లండ్.. మైదానంలో ఆ సిగ్నల్ ఇచ్చినందుకేనా? ఫైరవుతోన్న ఫ్యాన్స్..
India Vs England Virat Kohli
Venkata Chari
|

Updated on: Jul 06, 2022 | 5:25 PM

Share

ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో తొలి మూడు రోజులు అద్భుత ప్రదర్శన చేసినా టీమిండియా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ కేవలం 3 వికెట్లు కోల్పోయి సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో జో రూట్, జానీ బెయిర్‌స్టో సెంచరీలు బాది టీమ్‌ఇండియా నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు.దీంతో 15 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్న భారత జట్టు కల నెరవేరలేదు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ గురించి మాట్లాడితే, విరాట్ కోహ్లీ ఫ్లాప్ అని నిరూపించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యాడు. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత, ఇంగ్లాండ్ క్రికెట్ విరాట్ కోహ్లీని ట్వీట్ ద్వారా ట్రోల్ చేసింది.

ఇంగ్లండ్ క్రికెట్ రెండు ఫొటోలను పోస్ట్ చేసింది. అందులో జానీ బెయిర్‌స్టో దూకుడుగా ఆడుతుండడంతో విరాట్ కోహ్లీ సైలెంట్‌గా ఉండాలని సూచిస్తున్నాడు. రెండవ ఫొటోలో కోహ్లీని జానీ బెయిర్‌స్టోను కౌగిలించుకున్నాడు. ఈ ఫోటోపై, ECB మాట్లాడటం ఆపమన్నట్లు సూచించే ఎమోజీని పంచుకుంది.

ఇవి కూడా చదవండి

బెయిర్‌స్టోతో కోహ్లీ..

విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టోతో గొడవపడ్డాడు. విరాట్ కోహ్లీ, బెయిర్‌స్టోను స్లెడ్జ్ చేశాడు. అయితే, అతని పంతం టీమ్ ఇండియాపై సాగింది. బెయిర్‌స్టో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయగా, రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ చేసి ఇంగ్లండ్‌కు మ్యాచ్‌ను గెలిపించాడు. బెయిర్‌స్టో సెంచరీ తర్వాత, విరాట్ కోహ్లీ, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ, అతనిని ప్రశంసించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇద్దరూ కౌగిలించుకున్నారు.

కోహ్లిపై బెయిర్‌స్టోకు కోపం వచ్చిందా?

కోహ్లీ స్లెడ్జ్ తర్వాత, బెయిర్‌స్టో మ్యాచ్‌లో చాలా కోపంగా కనిపించాడు. అయితే మైదానం నుంచి బయటకు వచ్చిన తర్వాత, అతను దానిని క్రికెట్‌లో భాగంగా పేర్కొన్నాడు. మ్యాచ్ సమయంలోనే ఇదంతా జరుగుతుందని బెయిర్‌స్టో చెప్పుకొచ్చాడు. కోహ్లి చాలా మంచి క్రికెట్‌ ఆడతాడంటూ పేర్కొన్నాడు.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..