AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: బుమ్రాపై విమర్శలు.. ఆ సైగలతో ఆసీస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కింగ్ కోహ్లీ

Virat Kohli Teases SCG Crowd: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 ఐదవ, చివరి టెస్టులో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య పోరు తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఫలితం మరి కొద్దిసేపట్లో తేలనుంది. 7 వికెట్ల పడగొడితే భారత జట్టు విజయం సాధించనుంది. అలాగే ఆస్ట్రేలియా మరో 91 పరుగులు చేస్తే సిడ్నీ టెస్ట్‌నే కాదు, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని దక్కించుకుంటుంది.

Video: బుమ్రాపై విమర్శలు.. ఆ సైగలతో ఆసీస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కింగ్ కోహ్లీ
Virat Kohli Teases Scg Crowd
Venkata Chari
|

Updated on: Jan 05, 2025 | 7:52 AM

Share

Virat Kohli Teases SCG Crowd: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 ఐదవ, చివరి టెస్టులో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య పోరు తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఫలితం మరి కొద్దిసేపట్లో తేలనుంది. 7 వికెట్ల పడగొడితే భారత జట్టు విజయం సాధించనుంది. అలాగే ఆస్ట్రేలియా మరో 91 పరుగులు చేస్తే సిడ్నీ టెస్ట్‌నే కాదు, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని దక్కించుకుంటుంది.

భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టును ఆటలో నిలచేలా చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ కేవలం 157 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కి 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, బుమ్రా లేకపోవడంతో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా బరిలోకి దిగాడు.

ఇవి కూడా చదవండి

కాగా, నాలుగో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించలేదు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ లైన్ అండ్ లెన్త్‌లో బౌలింగ్ చేయలేకపోవడంతో తొలి ఓవర్లలోనే పరుగులు భారీగా ఇచ్చారు. అయితే, వెంటనే తేరుకున్న భారత బౌలర్లు ఆస్ట్రేలియా 3 వికెట్లు పడగొట్టారు.

ప్రేక్షకులను చూస్తూ విరాట్ కోహ్లీ శాండ్ పేపర్ సైగలు..

ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెట్లు తీయడంతో, SCG ప్రేక్షకులు కొంచెం అశాంతికి గురయ్యారు. ఈ క్రమంలో భారత జట్టు స్టాండ్-ఇన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రేక్షకులను మరింత ఆటపట్టించడం కనిపించింది. ప్రేక్షకులను చూస్తూ ఖాళీ జేబులను చూపిస్తూ, సైగలు చేశాడు. అంటే ఈ మ్యాచ్‌లో ఫలితాలను పొందడానికి టీమిండియా ఎలాంటి శాండ్ పేపర్‌ను ఉపయోగించడం లేదంటూ సూచించాడు.

విరాట్ ఇలా చేయడం వెనుక ఓ కారణం దాగుంది. అంతకుముందు ఆట రెండవ రోజు, ఆస్ట్రేలియా బ్యాటర్‌లను బంతితో ఔట్ చేసేందుకు బుమ్రా ఇసుక పేపర్‌ను ఉపయోగించాడని ఆస్ట్రేలియా అభిమానులు సోషల్ మీడియాలో ఒక వీడియోను ప్రసారం చేశారు. దీంతో విసుగు చెందిన విరాట్ కోహ్లీ లైవ్ మ్యాచ్‌లో ఇలాంటి సైగలు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..