AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: దక్షిణాఫ్రికాపై గెలిస్తే చరిత్రే.. ధోని సరసన చేరనున్న హిట్‌మ్యాన్.. అదేంటంటే?

South Africa vs India 2nd Test: ఈ 2 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ మరియు 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా ఇప్పుడు సిరీస్ గెలవాలంటే 2వ మ్యాచ్ డ్రా అయితే చాలు. కానీ, టీమ్ ఇండియా గెలిస్తేనే సిరీస్ డ్రా అవుతుంది. ఈ క్రమంలో కేప్‌టౌన్‌లో భారత జట్టు గెలిస్తే సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. అది కూడా రోహిత్ శర్మ పేరులోనే కావడం విశేషం.

IND vs SA: దక్షిణాఫ్రికాపై గెలిస్తే చరిత్రే.. ధోని సరసన చేరనున్న హిట్‌మ్యాన్.. అదేంటంటే?
Rohit Sharma Ind Vs Sa 2nd
Venkata Chari
|

Updated on: Jan 03, 2024 | 4:05 PM

Share

South Africa vs India, 2nd Test: భారత్-దక్షిణాఫ్రికా (IND vs SA) మధ్య నేటి నుంచి 2వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. కేప్‌టౌన్ లోని న్యూలాండ్స్ మైదానంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, ఆ నిర్ణయం తప్పని తేలడంతో.. సౌతాఫ్రికా జట్టు కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా పేసర్ల ధాటికి సౌతాఫ్రికా బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో ఆ జట్టు రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకు ఆలౌటైంది. భారత్‌పై అత్యల్ప స్కోరుకే ఆ జట్టు పెవిలియన్ చేరింది. కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికా కేవలం 23.2 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేయగలిగింది. భారత్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో సత్తా చాటాడు.

సరికొత్త చరిత్ర..

అయితే, ఈ మ్యాచ్‌తో టీమ్ ఇండియా సరికొత్త చరిత్రను లిఖించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 2 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా ఇప్పుడు సిరీస్ గెలవాలంటే 2వ మ్యాచ్ డ్రా అయితే చాలు. కానీ, టీమ్ ఇండియా గెలిస్తేనే సిరీస్ డ్రా అవుతుంది.

కేప్‌టౌన్‌లో భారత జట్టు గెలిస్తే సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. అది కూడా రోహిత్ శర్మ పేరులోనే కావడం విశేషం. అంటే దక్షిణాఫ్రికాలో భారత జట్టు 9 టెస్టు సిరీస్‌లు ఆడింది. భారత జట్టు ఇప్పటి వరకు టెస్టు సిరీస్‌ను గెలవకపోవడం ఆశ్చర్యకరం. అయితే 2010-11లో ధోనీ సారథ్యంలో టీమిండియా 1-1తో సిరీస్‌ను డ్రాగా ముగించగలిగింది. ఈ సిరీస్‌తో పాటు మిగిలిన 8 సిరీస్‌ల్లోనూ టీమిండియా ఓడిపోయింది.

ఇప్పుడు 2వ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే సిరీస్ 1-1తో సమం అవుతుంది. దీని ద్వారా దక్షిణాఫ్రికాలో సిరీస్‌ను డ్రా చేసుకున్న మహేంద్ర సింగ్ ధోని తర్వాత 2వ కెప్టెన్‌గా రోహిత్ శర్మకు మంచి అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగానే న్యూలాండ్స్ మైదానంలో టీమిండియా కొత్త చరిత్రను లిఖిస్తుందో లేదో వేచి చూడాలి.

రెండు జట్ల ప్లేయింగ్-11..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ.

దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్‌రామ్, టోనీ డిజార్జ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వేరియన్ (వికెట్ కీపర్), మార్కో యాన్సన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్‌గిడి, నాండ్రే బెర్గర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..