IPL 2024: హైదరాబాద్ చేతిలో ఓటమి.. రోహిత్తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ !
. బుధవారం (మార్చి 27) రాత్రి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బౌలర్లను చితక బాదుతూ హైదరాబాదీ బ్యాటర్లు ఏకంగా 277 పరుగులు చేశారు. అనంతరం బ్యాటర్లు ధాటిగానే ఆడినా లక్ష్యం మరీ ఎక్కువైపోవడంతో ముంబై ఇండియన్స్ జట్టు 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత ముంబై జట్టు యజమాని ఆకాష్ అంబానీ రోహిత్ శర్మను కలిశాడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) చరిత్రలో ముంబై ఇండియన్స్ జట్టు చెత్త రికార్డును మూట గట్టుకుంది. ఏకంగా 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన ముంబైపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా టోర్నీ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. బుధవారం (మార్చి 27) రాత్రి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బౌలర్లను చితక బాదుతూ హైదరాబాదీ బ్యాటర్లు ఏకంగా 277 పరుగులు చేశారు. అనంతరం బ్యాటర్లు ధాటిగానే ఆడినా లక్ష్యం మరీ ఎక్కువైపోవడంతో ముంబై ఇండియన్స్ జట్టు 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత ముంబై జట్టు యజమాని ఆకాష్ అంబానీ రోహిత్ శర్మను కలిశాడు. వీరి మధ్య సుదీర్ఘ చర్చలు కూడా జరిగాయి. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఐపీఎల్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలను అప్పగించింది. కానీ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ తొలి రెండు మ్యాచ్ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు అందించిన అపఖ్యాతిని మూటగట్టుకోవడం ఆ ఫ్రాంచైజీని తీవ్రనిరాశకు గురిచేసింది.
ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఓనర్లు ఆకాష్ అంబానీ, నీతా అంబానీలు రోహిత్ శర్మతో జట్టు పరిస్థితిపై చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో క్రికెట్ అభిమానులు, నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని, మళ్లీ రోహిత్ కే పగ్గాలు కట్టబెడతారంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 277 పరుగులు చేసింది. హైదరాబాద్ తరఫున హెన్రిక్ క్లాసెన్ అజేయంగా 80 పరుగులు చేశాడు. 34 బంతుల్లో 7 సిక్సర్లు, 4 ఫోర్లు బాదాడు. అభిషేక్ శర్మ 63 పరుగులతో, ట్రావిస్ హెడ్ 62 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. బదులుగా భారీ లక్ష్య ఛేదనలో ముంబై 246 పరుగులు మాత్రమే చేసింది. తిలక్ వర్మ ఇన్నింగ్స్ 64 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ముంబై బౌలర్లను పరిశీలిస్తే.. పీయూష్ చావ్లా 2 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. షమ్స్ ములానీ 2 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చాడు. మఫాకా 4 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చాడు.
రోహిత్ తో మాట్లాడుతున్న ఆకాశ్ అంబానీ.. వీడియో
Meanwhile Akash ambani : Rohit bhai captaincy le lo ab aur nhi dekhi jaa rahi pandya ki captaincy 🤨 pic.twitter.com/SZQlxb4Cc2
— 𝐑𝐢𝐲𝐚⁴⁵ (@iamriyadwivedi2) March 28, 2024
Akash Ambani having a chat with Rohit after the loss.#Akashambani #RohitSharma𓃵 #IPLUpdate #IPL #IPLonJioCinema #IPL2024live #IPLT20 pic.twitter.com/tRTaVlSUeL
— Kishore Reddy (@Kishore_reddy6) March 27, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..