AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ నుంచి హార్దిక్ పాండ్యా ఔట్! వైస్ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్

ప్రస్తుతం ఐపీఎల్ టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. ఇది ముగిసిన వెంటనే జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఈ టోర్నీ కోసం మే 1న టీమ్ ఇండియాను ఎంపిక చేయనున్నారు. అయితే భారత జట్టు ఎంపిక విషయంలో బీసీసీఐ మల్ల గుల్లాలు పడుతోందని సమాచారం.

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ నుంచి హార్దిక్ పాండ్యా ఔట్! వైస్ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్
Team India
Basha Shek
|

Updated on: Apr 29, 2024 | 10:01 PM

Share

ప్రస్తుతం ఐపీఎల్ టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. ఇది ముగిసిన వెంటనే జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఈ టోర్నీ కోసం మే 1న టీమ్ ఇండియాను ఎంపిక చేయనున్నారు. అయితే భారత జట్టు ఎంపిక విషయంలో బీసీసీఐ మల్ల గుల్లాలు పడుతోందని సమాచారం. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా విషయంలో ఏం చేయాలో బోర్డుకు తెలియడం లేదు. ఈ నేపథ్యంలో టీ 20 ప్రపంచ కప్ లో భారత జట్టు వైస్ కెప్టెన్సీ బాధ్యతలను మరోసారి రిషబ్ పంత్‌కు సెలక్షన్ కమిటీ అప్పగించే అవకాశం ఉంది. క్రిక్‌బజ్ తన నివేదికలో ఈ సమాచారాన్ని వెల్లడించింది. డిసెంబర్ 2022లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పంత్ గాయపడ్డాడు. చాలా రోజుల పాటు క్రికెట్ కు దూరంగా ఉన్న పంత్ ఐపీఎల్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ను సమర్థంగా నడిపిస్తున్నాడు. కాగా గతంలో రిషభ్ పంత్ ఇంతకు ముందు టీమిండియా సారథిగా వ్యవహరించాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఓవరాల్‌గా టీ20 ప్రపంచ కప్ లో రిషబ్ పంత్ వికెట్ కీపర్ తో పాటు కెప్టెన్ గా కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు.

మరోవైపు, రిషబ్ పంత్‌ వైస్ కెప్టెన్ గా జట్టులోకి తీసుకురావడం అనుకున్నంత సులభం కాదు. హార్దిక్ పాండ్యాను టీమ్ లో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవడం చాలా పెద్ద నిర్ణయమం. అయితే ఈ విషయంలో రిషబ్ పంత్‌కు కొన్ని అనుకూల పరిస్థితులు కలిసొస్తున్నాయి. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా జట్టను అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు పంత్. అదే సమయంలో ముంబై కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఘోరంగా విఫలమవుతున్నాడు. ఇక ప్రపంచకప్ లో భారత జట్టు ఎంపిక విషయానికి వస్తే.. స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌కు అవకాశం లభించవచ్చు. అలాగే అక్షర్ పటేల్ స్థానంలో రవి బిష్ణోయ్ కు స్థానం దక్కవచ్చని అంచనా వేసింది. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ ఫాస్ట్ బౌలర్లుగా జట్టులో ఉండవచ్చు. నాలుగో ఫాస్ట్ బౌలర్‌గా సందీప్ శర్మను ఎంపిక చేయవచ్చు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న సందీప్ శర్మ తన స్లో-మీడియం పేస్‌తో ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్ స్లో పిచ్‌పై అతను ప్రభావం చూపిస్తాడని క్రికెట్ బజ్ నివేదించింది. అయితే 2015 నుంచి సందీప్ శర్మ టీమ్ ఇండియాకు ఆడలేదు

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..