AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishabh Pant: 4వ టెస్ట్ నుంచి రిషబ్ పంత్ ఔట్.. శుభమాన్ గిల్ ఏమన్నాడంటే..?

India vs England 4th Test: లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. దీంతో సిరీస్‌ను సమం చేయాలంటే నాలుగో టెస్టులో భారత్ తప్పక గెలవాలి. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జులై 23న ప్రారంభం కానుంది.

Rishabh Pant: 4వ టెస్ట్ నుంచి రిషబ్ పంత్ ఔట్.. శుభమాన్ గిల్ ఏమన్నాడంటే..?
Rishabh Pant
Venkata Chari
|

Updated on: Jul 15, 2025 | 6:37 PM

Share

 India vs England 4th Test: భారత్, ఇంగ్లాండ్ మధ్య ఉత్కంఠగా సాగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో నాలుగో టెస్ట్ ఆరంభానికి ముందు భారత జట్టుకు సంబంధించి రెండు కీలక అప్‌డేట్‌లు వచ్చాయి. ముఖ్యంగా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఫిట్‌నెస్, అలాగే కెప్టెన్ శుభమాన్ గిల్ పరిస్థితిపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రిషబ్ పంత్ ఆడతాడా? శుభమాన్ గిల్ ఏమన్నాడంటే..?

శుభవార్త ఏమిటంటే, భారత కెప్టెన్ శుభమాన్ గిల్ మాట్లాడుతూ, లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో ఎడమ చూపుడు వేలికి గాయంతో ఇబ్బంది పడుతోన్న వైస్ కెప్టెన్ రిషబ్ పంత్, నాలుగో టెస్టుకు అందుబాటులో ఉంటాడని ధృవీకరించాడు. “రిషబ్ స్కానింగ్‌లకు వెళ్లాడు. అతనికి పెద్ద గాయమేమీ లేదు, కాబట్టి మాంచెస్టర్‌లో జరిగే నాలుగో టెస్టుకు అతను అందుబాటులో ఉంటాడు” అని గిల్ మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపాడు.

లార్డ్స్ టెస్టులో వికెట్ కీపింగ్ చేస్తున్నప్పుడు జస్‌ప్రీత్ బుమ్రా వేసిన డెలివరీని ఆపే ప్రయత్నంలో పంత్‌కు ఈ గాయమైంది. ఆ తర్వాత అతను వికెట్ కీపింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, రెండు ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్‌కు దిగాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 74 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే, గిల్ ప్రకటనతో పంత్ నాలుగో టెస్టులో ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమైంది. ఈ సిరీస్‌లో పంత్ ఇప్పటికే రెండు సెంచరీలు సాధించి భారత జట్టు తరపున అత్యధిక పరుగులు (425) చేసిన రెండో ఆటగాడిగా ఉన్నాడు.

నాలుగో టెస్టుపై ఆశలు..

లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. దీంతో సిరీస్‌ను సమం చేయాలంటే నాలుగో టెస్టులో భారత్ తప్పక గెలవాలి. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జులై 23న ప్రారంభమయ్యే ఈ కీలక టెస్టులో రిషబ్ పంత్ రాక భారత బ్యాటింగ్ లైనప్‌కు మరింత బలం చేకూరుస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు పుంజుకొని సిరీస్‌ను ఉత్కంఠగా మార్చుతుందో లేదో చూడాలి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..