AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Auction 2023: ఐపీఎల్ మినీ వేలం వేదికలో కీలక మార్పు.. డిసెంబర్ 16న నిర్వహించేది ఎక్కడంటే?

ఐపీఎల్ వేలానికి సంబంధించి ఫ్రాంచైజీ యజమానులతో బీసీసీఐ కమిటీ చర్చలు ప్రారంభించింది. ఫ్రాంచైజీకి అనుమతి లభించిన వెంటనే మినీ వేలం జరిగే వేదికను బీసీసీఐ వెల్లడించనుంది.

IPL Auction 2023: ఐపీఎల్ మినీ వేలం వేదికలో కీలక మార్పు.. డిసెంబర్ 16న నిర్వహించేది ఎక్కడంటే?
Ipl 2023 Mini Auction
Venkata Chari
|

Updated on: Oct 26, 2022 | 6:01 PM

Share

ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలాన్ని దేశం వెలుపల నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) యోచిస్తోంది. నివేదికల ప్రకారం, IPL వేలానికి ఓ వేదికను ఎంపిక చేసింది. వేలం నిర్వహించడానికి మొదటి ఎంపికగా టర్కీలోని ఇస్తాంబుల్ నగరాన్ని ఎంచుకుంది. మరోవైపు, ఇస్తాంబుల్‌కు ఐపీఎల్ జట్లు సిద్ధంగా లేకుంటే, ఆ వేలాన్ని బెంగళూరులో నిర్వహించనున్నారు. ఇస్తాంబుల్‌లో ఐపీఎల్ వేలానికి సంబంధించి ఫ్రాంచైజీ యజమానులతో బీసీసీఐ కమిటీ చర్చలు ప్రారంభించింది. ఫ్రాంచైజీకి అనుమతి లభించిన వెంటనే మినీ వేలం జరిగే వేదికను బీసీసీఐ వెల్లడించనుంది. ఇస్తాంబుల్‌పై ఏకాభిప్రాయం కుదరకపోతే బెంగళూరులో మినీ వేలం నిర్వహిస్తారు.

లండన్‌లో వేలం ఎందుకు జరగదంటే..

విదేశాలలో ఐపీఎల్ వేలం నిర్వహించడంపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. కరోనాకు ముందు ఐపీఎల్ వేలం కోసం సింగపూర్‌లో ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఆ తర్వాత లండన్‌లో వేలం నిర్వహించేందుకు అనుమతి లభించింది. అయితే, ఫ్రాంచైజీ యజమానులు నిరాకరించడంతో లండన్‌లో వేలం జరగడం లేదు.

డిసెంబర్ 16న బిడ్డింగ్..

మీడియా కథనాల ప్రకారం ఐపీఎల్ వేలం డిసెంబర్ 16న నిర్వహించవచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై బీసీసీఐ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అదే సమయంలో ఫ్రాంచైజీ నవంబర్ 15 లోపు ఆటగాళ్ల విడుదలకు సంబంధించిన సమాచారాన్ని బీసీసీఐతో పంచుకోవాల్సి ఉంటుంది. గతేడాది మెగా వేలం తర్వాత ఈ ఏడాది మినీ వేలం జరగనుంది. అంటే అన్ని జట్లు తమ అభిమాన ఆటగాళ్లను తమతో ఉంచుకోవచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

రూ. 5 కోట్లు పెరిగిన పర్స్..

మినీ వేలం కోసం జట్ల పర్స్‌లో రూ.5 కోట్లు పెంచారు. గతేడాది జట్లతో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు రూ.90 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది జట్లకు రూ.95 కోట్లు తమ పర్స్‌లో ఉంచారు. IPL 2023 మార్చి మూడవ వారంలో ప్రారంభమై మే చివరి వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు.

అరంగేట్రంలోనే టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్..

2022లో ఐపీఎల్ 8 జట్లకు బదులుగా 10 జట్లతో జరిగింది. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ వంటి రెండు కొత్త జట్లు టోర్నీలో ప్రవేశించాయి. టోర్నీ ఫైనల్‌లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. 2008 మొదటి సీజన్ మినహా, గుజరాత్ టైటాన్స్ తమ తొలి టోర్నమెంట్‌లోనే టైటిల్‌ను గెలుచుకున్న మొదటి జట్టుగా అవతరించింది.

Follow Us
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!