AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KKR vs GT: ఏంది, కోల్‌కతా ఓడింది ఈ కారణంతోనేనా.. మ్యాచ్‌లో ట్విస్ట్ మాములుగా లేదుగా..

Kolkata Knight Riders vs Gujarat Titans, 39th Match: ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఏకపక్ష విజయాన్ని సాధించింది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ విభాగాల సమష్టి ప్రదర్శనతో ఐపీఎల్ 2025లో సత్తా చాటుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ విభాగంలో లోపాటు మరోసారి బహిర్గతమయ్యాయి. రాబోయే మ్యాచ్‌లలో కోల్‌కతా టీం ఎలా రాణిస్తుందో చూడాలి. గుజరాత్ టైటాన్స్ తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతుండగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకునే దిశగా సాగుతోంది.

KKR vs GT: ఏంది, కోల్‌కతా ఓడింది ఈ కారణంతోనేనా.. మ్యాచ్‌లో ట్విస్ట్ మాములుగా లేదుగా..
Kolkata Knight Riders Vs Gujarat Titans
Venkata Chari
|

Updated on: Apr 22, 2025 | 7:19 AM

Share

Kolkata Knight Riders vs Gujarat Titans, 39th Match: ఈడెన్ గార్డెన్స్‌లో నిన్న రాత్రి అంటే ఏప్రిల్ 21, 2025న జరిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మస్త్ మజా అందించింది. ఈ పోరులో గుజరాత్ టైటాన్స్ 39 పరుగుల తేడాతో , కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించింది. ఈ విజయం గుజరాత్ టైటాన్స్‌కు పాయింట్ల పట్టికలో మరింత బలమైన స్థానాన్ని కల్పించగా, కోల్‌కతా నైట్ రైడర్స్ తమ ప్రదర్శనను మెరుగుపరచుకోకపోతే, ప్లేఆఫ్స్ నుంచి తప్పుకోవాల్సిందేనని హెచ్చరిస్తోంది.

మ్యాచ్ రిజల్ట్..

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. గుజరాత్ తమ స్థిరమైన ఆటతీరుతో టేబుల్ టాపర్‌లుగా కొనసాగుతోంది. మరోవైపు, కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్‌లో ఓటమి పాలవడంతో పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో నిలిచింది. దీంతో మరోసారి కేకేఆర్ కెప్టెన్సీతోపాటు ఆటగాళ్ల ప్రదర్శనలోని లోపాలను ఎత్తి చూపించింది.

ఇది కూడా చదవండి: Video: ఇదేం బౌలింగ్ భయ్యా.. అర్థమయ్యేలోపే క్లీన్ బౌల్ట్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

ఇవి కూడా చదవండి

గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్:

గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్‌లో ఓపెనింగ్ భాగస్వామ్యం చాలా కీలకంగా నిలిచింది. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ కలిసి అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ కలిసి 114 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శుభ్‌మన్ గిల్ తన కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అతను 55 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 90 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్ కూడా తనవంతుగా 36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 52 పరుగులు చేశాడు. ఈ ఓపెనింగ్ భాగస్వామ్యం మ్యాచ్‌కు ఒక బలమైన పునాదిని వేసింది. ఆ తర్వాత వచ్చిన జోస్ బట్లర్ కూడా తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అతను 23 బంతుల్లో 8 ఫోర్లతో 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బట్లర్ చివరి ఓవర్లలో ఊచకోత కోశాడు. దీంతో గుజరాత్ స్కోరు 198 పరుగులకు చేరుకుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్:

199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రారంభంలోనే ఇబ్బందులు ఎదురయ్యాయి. వెంట వెంటనే కీలక వికెట్లను కోల్పోయింది. రహ్మానుల్లా గుర్బాజ్ కేవలం 1 పరుగుకే అవుట్ కాగా, సునీల్ నరైన్ 17 పరుగులు చేసి వెనుదిరిగాడు. ప్రారంభంలోనే రెండు ముఖ్యమైన వికెట్లు కోల్పోవడం కేకేఆర్ ఛేదనపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. కెప్టెన్ అజింక్య రహానే ఒంటరిగా పోరాటం చేశాడు. అతను 36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 50 పరుగులు చేశాడు. అయితే, ఇతర బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించలేదు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. వెంకటేష్ అయ్యర్ 14 పరుగులు, రింకూ సింగ్ 17 పరుగులు, ఆండ్రీ రస్సెల్ 21 పరుగులు మాత్రమే చేయగలిగారు. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం కేకేఆర్ ఛేదనను దెబ్బతీసింది. చివర్లో అంగ్‌క్రిష్ రఘువంశీ 13 బంతుల్లో 27 పరుగులతో వేగంగా ఆడటానికి ప్రయత్నించినప్పటికీ, అప్పటికే మ్యాచ్ కేకేఆర్ నుంచి చేజారిపోయింది.

మ్యాచ్ టర్నింగ్ పాయింట్:

గుజరాత్ టైటాన్స్ ఓపెనింగ్ భాగస్వామ్యం ఈ మ్యాచ్‌లో ఒక కీలక అంశం. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ జోడీ కేకేఆర్ బౌలర్లపై ఒత్తిడిని పెంచింది. వీరిద్దరి భాగస్వామ్యం కారణంగా కేకేఆర్ బౌలర్లకు వికెట్లు తీయడానికి ఎక్కువ అవకాశాలు రాలేదు. మరోవైపు, కేకేఆర్ బ్యాటర్లు కీలకమైన సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ చేజారిపోయింది. గుజరాత్ బౌలర్లు సమష్టిగా రాణించారు. ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ ఇద్దరూ 2 వికెట్లు తీసి కేకేఆర్ బ్యాటర్లను కట్టడి చేశారు. వీరితో పాటు మొహమ్మద్ సిరాజ్, సాయి కిషోర్, ఇషాంత్ శర్మ, వాషింగ్టన్ సుందర్ కూడా ఒక్కో వికెట్ తీశారు.

ఇది కూడా చదవండి: ఒరేయ్, ఎవర్రా నువ్వు.. టీ20ల్లో చెత్త బ్యాటింగ్.. ఓపెనర్‌గా వచ్చి నాటౌట్‌గా నిలిచి.. ఎన్ని రన్స్ చేశాడో తెలుసా?

ఆటగాళ్ల ప్రదర్శనలు:

ఈ మ్యాచ్‌లో ఉత్తమ ఆటగాడిగా నిలిచిన శుభ్‌మన్ గిల్ తన ఇన్నింగ్స్‌లో అద్భుతమైన టెంపోను కనబరిచాడు. అతను ఆడిన అటాకింగ్ షాట్లు జట్టును అగ్రస్థానంలో నిలిచేలా చేశాయి. సాయి సుదర్శన్ మరోసారి స్థిరమైన ప్రదర్శన కనబరిచాడు. అజింక్య రహానే ఒంటరిగా పోరాటం చేసినప్పటికీ, అతని పోరాటం జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. గుజరాత్ బౌలర్లు సమష్టిగా రాణించి కేకేఆర్ బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలమయ్యారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..