AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: MS ధోనీ, విరాట్‌కు సాధ్యం కాలే.. తొలి కెప్టెన్‌గా ఆ స్పెషల్ రికార్డ్‌లో రిషబ్ పంత్ చేరేనా?

మొదటి రెండు మ్యాచ్‌లలో భారత్ ఓడిపోయి, మూడో మ్యాచ్ నుంచి గేమ్‌లోకి వచ్చింది. నాలుగో మ్యాచ్‌లోనూ గెలిచింది. అలాగే ప్రస్తుతం సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్..

IND vs SA: MS ధోనీ, విరాట్‌కు సాధ్యం కాలే.. తొలి కెప్టెన్‌గా ఆ స్పెషల్ రికార్డ్‌లో రిషబ్ పంత్ చేరేనా?
Ind Vs Sa
Venkata Chari
|

Updated on: Jun 19, 2022 | 8:19 AM

Share

టీమిండియా అత్యంత విజయవంతమైన కెప్టెన్ల గురించి మనం మాట్లాడితే, మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ముందు వరుసలో ఉంటాడు. ధోనీ సారథ్యంలో భారత్ తొలి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుని, ఆ తర్వాత వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. భారత అత్యుత్తమ కెప్టెన్లలో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. అయితే, అతను ప్రస్తుతానికి కెప్టెన్ కాదు. టీ20 ప్రపంచకప్-2021 తర్వాత అతను జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. కెప్టెన్‌గా వీరిద్దరూ చేయలేని పనిని రిషబ్ పంత్(Rishabh Pant) చాలా దగ్గరగా చేస్తున్నాడు. ప్రస్తుతం భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గొంటున్నాయి. ఈ సిరీస్‌లో పంత్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రస్తుతం 2-2తో సమంగా ఉంది. ఈ సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో నేడు జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఈ విజయంలోనే పంత్ కెప్టెన్సీకి సంబంధించి ఓ రికార్డ్ కూడా ఉంది.

భారత్‌కు ఈ సిరీస్ ఆరంభం చాలా దారుణంగా ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ఇప్పటి వరకు చేయని పని ఈసారి కూడా కాదేమో అని అంతా భావించారు. కానీ, పంత్ కెప్టెన్సీలో భారత్ వచ్చే రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను సమం చేసి ఇప్పుడు సిరీస్‌కు చేరువైంది. ఈ సిరీస్‌ను భారత్‌ గెలిస్తే.. సౌతాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్‌ను గెలుచుకోవడం ఇదే తొలిసారి కానుంది. ఇంతకు ముందు భారత జట్టు రెండుసార్లు విఫలమైంది.

మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో..

ఇవి కూడా చదవండి

దక్షిణాఫ్రికా 2015లో భారత్‌లో తొలి టీ20 సిరీస్ ఆడింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 2-0తో కోల్పోవాల్సి వచ్చింది. అక్టోబర్ 2, 2015న ధర్మశాలలో జరిగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. అక్టోబర్ 5న కటక్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో పర్యాటక జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతాలో జరిగిన మూడో మ్యాచ్ బంతి కూడా వేయకుండానే మ్యాచ్ రద్దు అయింది. ఈ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా మహేంద్ర సింగ్‌ ధోనీ ఉన్నాడు.

కోహ్లీ కెప్టెన్సీలో కూడా నిరాశే..

దక్షిణాఫ్రికా జట్టు 2019లో మరోసారి భారత్‌ను సందర్శించగా, ఈసారి కూడా భారత్ దానిని ఓడించలేకపోయింది. సిరీస్‌లోని మొదటి మ్యాచ్ 15 సెప్టెంబర్ 2019న ధర్మశాలలో జరిగింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయింది. రెండో టీ20 సెప్టెంబర్ 18న మొహాలీలో జరిగింది. ఈ మ్యాచ్‌లోనూ భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. సెప్టెంబరు 22న బెంగళూరులో జరిగిన మూడో, చివరి మ్యాచ్‌లో కూడా భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఓడి సిరీస్‌ను చేజార్చుకుంది.

ఆదివారం నాటి మ్యాచ్‌లో భారత్ గెలిస్తే, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 సిరీస్ విజయం సాధించినట్లు అవుతుంది. దీంతో రిషబ్ పంత్ ఈ లిస్టులో అగ్రస్థానంలో నిలుస్తాడు.

Follow Us