AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Pak: భారత్-పాక్ మ్యాచ్ మాత్రమే కాదు.. ప్రపంచకప్ షెడ్యూల్‌లోనూ మార్పు.. క్లారిటీ ఇచ్చిన జైషా

World Cup 2023: గత రెండు రోజులుగా ప్రపంచ కప్ షెడ్యూల్ గురించి వినిపిస్తున్న ఊహాగానాలకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఎట్టకేలకు తెరతీశారు.

Ind vs Pak: భారత్-పాక్ మ్యాచ్ మాత్రమే కాదు.. ప్రపంచకప్ షెడ్యూల్‌లోనూ మార్పు.. క్లారిటీ ఇచ్చిన జైషా
Ind Vs Pak Match
Venkata Chari
|

Updated on: Jul 28, 2023 | 8:04 AM

Share

World Cup 2023 Schedule: ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌పై గత రెండు రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలకు బీసీసీఐ సెక్రటరీ జే షా ఎట్టకేలకు ముగింపు పలికారు. వాస్తవానికి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులైన భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా షెడ్యూల్‌ను సిద్ధం చేసి విడుదల చేశారు. అయితే అక్టోబర్ 15 నుంచి భారత్‌లో నవరాత్రులు ప్రారంభం కానుండగా, భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్ తేదీని మార్చాలని భద్రతా సంస్థలు బీసీసీఐకి సూచించాయి. అందుకే జులై 27న సమావేశాన్ని ఏర్పాటు చేసిన బీసీసీఐ సెక్రటరీ జై షా.. సమావేశం అనంతరం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకటన చేశారు.

గురువారం జరిగిన బీసీసీఐ సమావేశంలో భారత్‌-పాక్‌ మ్యాచ్‌పైనే చర్చ జరగడమే కాకుండా ప్రపంచకప్‌ షెడ్యూల్‌లో కొన్ని మ్యాచ్‌ల తేదీలను కూడా మార్చాలని నిర్ణయించారు. తేదీ మార్పులపై ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయినా.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని జై షా తెలిపారు.

ఇవి కూడా చదవండి

మారనున్న ప్రపంచకప్ షెడ్యూల్..

భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ తేదీని మార్చేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే గురువారం జరిగిన సమావేశంలో ప్రపంచకప్‌కు సంబంధించిన అన్ని ఆతిథ్య సంస్థలు షెడ్యూల్‌ను మార్చాలని ఐసీసీని అభ్యర్థించాయి. సమావేశం అనంతరం దీనిపై మాట్లాడిన జై షా.. భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ మాత్రమే కాకుండా ప్రపంచకప్ షెడ్యూల్ మార్చాలని మూడు సభ్య దేశాలు ఐసీసీని అభ్యర్థించాయి.

తేదీలు మాత్రమే మార్పు..

బీసీసీఐ సమావేశం తర్వాత, 23 మంది సభ్యుల బోర్డు షెడ్యూల్‌ను మార్చాలని ICCని అభ్యర్థించడంతో కొన్ని ప్రపంచ కప్ మ్యాచ్‌ల తేదీలను మార్చనున్నట్లు జై షా ధృవీకరించారు. మ్యాచ్ వేదికలో ఎలాంటి మార్పు ఉండదు. అయితే తేదీ మాత్రమే మారుతుందని జై షా తెలిపారు.

భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు?

వాస్తవానికి జూన్ 27న ఐసీసీ ప్రపంచకప్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్ తేదీని మారుస్తున్నారని, అక్టోబర్ 15కి బదులుగా అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో మ్యాచ్ జరగనుందని సమాచారం. అయితే ప్రపంచకప్ షెడ్యూల్‌లో మార్పును ధృవీకరించిన జై షా, మార్చాల్సిన తేదీలపై చర్చ జరుగుతుందని మాత్రమే చెప్పుకొచ్చాడు. అందువల్ల భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌పై కచ్చితమైన సమాచారం లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..