AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ‘ఇక సమరమే తరువాయి’.. హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ఇంగ్లండ్‌ జట్టు.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

భారత్‌తో జరిగే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ జట్టు హైదరాబాద్‌లో అడుగుపెట్టింది . ఇరు జట్ల తొలి టెస్టు మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఇలా ఆతిథ్య భారత్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని అక్కడ శిక్షణ ప్రారంభించింది.

IND vs ENG: 'ఇక సమరమే తరువాయి'.. హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ఇంగ్లండ్‌ జట్టు.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
England Cricket Team
Basha Shek
|

Updated on: Jan 22, 2024 | 5:46 PM

Share

భారత్‌తో జరిగే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ జట్టు హైదరాబాద్‌లో అడుగుపెట్టింది . ఇరు జట్ల తొలి టెస్టు మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఇలా ఆతిథ్య భారత్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని అక్కడ శిక్షణ ప్రారంభించింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఇంగ్లిష్‌ టీమ్‌కు ఘన స్వాగతం లభించింది. ఇంగ్లండ్‌-భారత్‌ల మధ్య జనవరి 25న ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌ మార్చి 11న ధర్మశాలలో జరిగే ఐదో, చివరి టెస్టుతో ముగుస్తుంది. హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ఇంగ్లండ్‌ జట్టు రేపటి నుంచి ప్రాక్టీస్‌ ప్రారంభించింది. నిజానికి ఈ ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ కోసం చాలా కాలం క్రితమే దుబాయ్ వెళ్లిన ఇంగ్లిష్ వాళ్లు అక్కడ కొద్దిరోజుల పాటు ప్రాక్టీస్ చేశారు. భారత్ లాంటి పరిస్థితుల్లో ప్రాక్టీస్ చేసేందుకు బెన్ స్టోక్స్ స్క్వాడ్ దుబాయ్‌లో ప్రాక్టీస్ చేసింది. ఇంగ్లండ్ జట్టుకు ఈ సిరీస్ చాలా కీలకం. ఎందుకంటే 2012లో భారత గడ్డపై చివరి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లిష్‌ ఆటగాళ్లు.. ఆ తర్వాత టీమిండియాను సొంతగడ్డపై ఓడించలేకపోయారు. ఇక ఇంగ్లండ్ యువ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ భారత పర్యటనకు దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల వల్ల బ్రూక్ ఈ పర్యటన నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో డాన్ లారెన్స్‌ జట్టులో కొచ్చాడు.

భారత్, ఇంగ్లండ్ మధ్య ఇప్పటివరకు మొత్తం 131 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. టెస్టుల్లో భారత్‌ కంటే ఇంగ్లండ్‌ రికార్డు మెరుగ్గా ఉంది. 131 మ్యాచుల్లో ఇంగ్లండ్ 50 గెలుపొందగా, భారత్ 31 మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించింది. భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మొత్తం మ్యాచ్‌ల్లో 50 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. స్వదేశంలో టీం ఇండియా మొత్తం 22 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇది కాకుండా మొత్తం 9 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఇంగ్లండ్‌ గురించి మాట్లాడితే, ఇంగ్లిష్‌ వారి సొంత మైదానంలో మొత్తం 36 మ్యాచ్‌లు గెలుపొందగా, భారత్‌లో 14 మ్యాచ్‌లు గెలిచారు. భారత్‌తో పోలిస్తే ఇంగ్లండ్‌దే పైచేయి అని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. అయితే ఇటీవలి కాలంలో భారత జట్టు రాణిస్తున్న తీరు చూస్తుంటే భారత్‌లో భారత్‌ను ఓడించడం ఇంగ్లండ్‌కు అంత ఈజీ కాదు.

ఇవి కూడా చదవండి

టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు:

బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలే, బెన్ డకెట్, రెహాన్ అహ్మద్, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), షోయబ్ బషీర్, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), జేమ్స్ అండర్సన్, గస్ అట్కిన్సన్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఆలీ పోప్, ఆలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్.

భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్:

  • జనవరి 25 నుండి 29 వరకు – మొదటి టెస్ట్ (హైదరాబాద్)
  • ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు – రెండో టెస్టు (విశాఖపట్నం)
  • ఫిబ్రవరి 15 నుండి 19 వరకు – మూడో టెస్టు (రాజ్‌కోట్)
  • ఫిబ్రవరి 23 నుండి 27 వరకు – నాల్గవ టెస్ట్ (రాంచీ)
  • మార్చి 7 నుండి 11 వరకు – ఐదవ టెస్ట్ (ధర్మశాల)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us