AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG 3rd Test: 5 వికెట్లతో చెలరేగిన లోకల్ బాయ్.. 434 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం.. సిరీస్‌లో 2-1తో ఆధిక్యం..

India vs England 3rd Test: రాజ్‌కోట్‌ టెస్టులో టీమిండియా 434 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు నాలుగో ఇన్నింగ్స్‌లో 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో మార్క్ వుడ్ క్యాచ్ ఔట్ కావడంతో ఇంగ్లండ్ జట్టు తన చివరి వికెట్‌ను కోల్పోయింది. దీంతో రవీంద్ర జడేజా 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

IND vs ENG 3rd Test: 5 వికెట్లతో చెలరేగిన లోకల్ బాయ్.. 434 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం.. సిరీస్‌లో 2-1తో ఆధిక్యం..
Ind Vs Eng 3rd Test Result
Venkata Chari
|

Updated on: Feb 18, 2024 | 5:04 PM

Share

India vs England 3rd Test: రాజ్‌కోట్‌ టెస్టులో టీమిండియా 434 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు నాలుగో ఇన్నింగ్స్‌లో 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో మార్క్ వుడ్ క్యాచ్ ఔట్ కావడంతో ఇంగ్లండ్ జట్టు తన చివరి వికెట్‌ను కోల్పోయింది. దీంతో రవీంద్ర జడేజా 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

భారత్ రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 214 పరుగులు చేయగా, శుభమన్ గిల్ 91 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ 131 పరుగులు, రవీంద్ర జడేజా 112 పరుగులు చేశారు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డెబ్యూ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ అర్ధశతకాలు సాధించాడు. బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్ 4 వికెట్లు తీశాడు.

ఇంగ్లండ్‌కు చెందిన బెన్ డకెట్ తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులు చేశాడు. అతను మినహా మరే ఇతర ఆటగాడు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఫిఫ్టీ సాధించలేకపోయాడు. నిరంజన్ షా స్టేడియంలో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 445 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 319 పరుగులు చేసింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 430 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

అతి పెద్ద విజయం..

పరుగుల తేడాతో టీమ్ ఇండియాకు ఇదే అతిపెద్ద విజయంగా నిలిచింది. అంతకుముందు 2021లో ముంబైలోని వాంఖడే మైదానంలో భారత జట్టు 372 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.

మూడో సెషన్‌లో కుప్పకూలిన ఇంగ్లండ్..

నాలుగో రోజు మూడో సెషన్‌లో ఇంగ్లాండ్ 18/2 స్కోరుతో ఆడడం ప్రారంభించింది. దీంతో ఆ జట్టు స్కోరు 50 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. టామ్ హార్ట్లీ, బెన్ ఫాక్స్ ఇన్నింగ్స్‌ను హ్యాండిల్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఇద్దరూ 16 పరుగులు చేసిన తర్వాత ఔట్ అయ్యారు.

చివర్లో మార్క్ వుడ్ 15 బంతుల్లో 33 పరుగులు చేసి జట్టును 100 పరుగులు దాటించాడు. కానీ, సొంతగడ్డపై రవీంద్ర జడేజా 5 వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 122 పరుగులకే కుప్పకూలింది. ఈ సెషన్‌లో ఇంగ్లండ్ 31.2 ఓవర్లలో 104 పరుగులు చేసింది.

రెండు జట్ల ప్లేయింగ్-11..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా మరియు మహ్మద్ సిరాజ్.

ఇంగ్లండ్: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్ మరియు జేమ్స్ ఆండర్సన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..