AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ‘దేశవాళీకి దూరమైతే భారత జట్టుకు ఇక ఆడలేరు..’: టీమిండియా ఆటగాళ్లకు జైషా హెచ్చరికలు..

BCCI Secretory Jay Shah: అయితే, జై షా ఈ లేఖ ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ చాహర్ వంటి ఆటగాళ్లతో ముడిపడి ఉంది. ప్రస్తుతం భారత జట్టులో ఇషాన్ కిషన్ లేడు. అలాగే, రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల చివరి రౌండ్‌లో పాల్గొనడం లేదు. ఇందులో శ్రేయాస్ అయ్యర్ గ్రేడ్ బి కాంట్రాక్ట్ ప్లేయర్, ఇషాన్ కిషన్ గ్రేడ్ సి కాంట్రాక్ట్ ప్లేయర్.

Team India: 'దేశవాళీకి దూరమైతే భారత జట్టుకు ఇక ఆడలేరు..': టీమిండియా ఆటగాళ్లకు జైషా హెచ్చరికలు..
Jay Shah
Venkata Chari
|

Updated on: Feb 18, 2024 | 5:21 PM

Share

Indian Cricket Team: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) సెక్రటరీ జైషా (Jay Shah), కాంట్రాక్ట్ ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేశాడు. భారత్‌కు ఆడాలనుకుంటే, దేశవాళీ క్రికెట్‌లో తమను తాము నిరూపించుకోవాల్సి ఉంటుందని సూటిగా చెప్పుకొచ్చాడు. దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనని ఆటగాళ్లు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. ESPNcricinfo ప్రకారం, BCCI సెక్రటరీ జైషా, ఈ వారం ఆటగాళ్లకు రాసిన లేఖలో, దేశవాళీ క్రికెట్ కంటే IPLకి ప్రాముఖ్యత ఇవ్వడంపై ఆందోళన వ్యక్తం చేశాడు.

జైషా తన లేఖలో ‘ఇటీవల కొంతమంది ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ కంటే ఐపీఎల్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపించింది. ఇది ఊహించని మార్పు. దేశీయ క్రికెట్ ఎల్లప్పుడూ భారత క్రికెట్‌కు పునాదిగా ఉంది. ఆట పట్ల మన విధానంలో ఎన్నడూ తక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదు అంటూ పేర్కొన్నాడు.

అలాగే ‘దేశీయ క్రికెట్ ఎల్లప్పుడూ భారత క్రికెట్‌కు వెన్నెముక. భారత జట్టులో చేరాలనుకునే ప్రతి క్రికెటర్ దేశవాళీ క్రికెట్‌లో తనను తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది. దేశవాళీ క్రికెట్‌లో ప్రదర్శన ఎంపికకు ప్రధాన ప్రమాణం. పాల్గొనడంలో వైఫల్యం తీవ్రమైన పరిణామాలను కలిగి ఉంటుంది. IPL ప్రజాదరణ, విజయం గురించి మేం గర్విస్తున్నాం. అయితే ఆటగాళ్ళు దేశీయ రెడ్ బాల్ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాడు.

అయితే, జై షా ఈ లేఖ ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ చాహర్ వంటి ఆటగాళ్లతో ముడిపడి ఉంది. ప్రస్తుతం భారత జట్టులో ఇషాన్ కిషన్ లేడు. అలాగే, రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల చివరి రౌండ్‌లో పాల్గొనడం లేదు. ఇందులో శ్రేయాస్ అయ్యర్ గ్రేడ్ బి కాంట్రాక్ట్ ప్లేయర్, ఇషాన్ కిషన్ గ్రేడ్ సి కాంట్రాక్ట్ ప్లేయర్.

దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తన పేరును ఉపసంహరించుకున్న ఇషాన్ కిషన్..

టీమిండియా యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు. దీంతో అతను భారత జట్టులో చేరలేదు. రంజీ ట్రోఫీలో కూడా కిషన్ తన జట్టు జార్ఖండ్ తరపున ఆడలేదు. నివేదికల ప్రకారం, అతను బరోడాలో హార్దిక్, కృనాల్ పాండ్యాతో శిక్షణ పొందుతున్నాడు.

మరోవైపు, ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు శ్రేయాస్ అయ్యర్ భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. జట్టుకు దూరమైన తర్వాత కూడా అయ్యర్ రంజీ ట్రోఫీ ఆడేందుకు వెళ్లలేదు. అయితే, అయ్యర్ రంజీ ట్రోఫీ మొదటి రౌండ్‌లో ఆడుతూ కనిపించాడు.

దీపక్ చాహర్ గురించి మాట్లాడితే, అతని గాయం నుంచి కోలుకున్న తర్వాత, వ్యక్తిగత కారణాల వల్ల భారత జట్టులో చేరలేకపోయాడు. ప్రస్తుత రంజీ ట్రోఫీలో కూడా అతను తన జట్టు రాజస్థాన్ తరపున ఆడటం కనిపించలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..