AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS 3rd ODI : సిడ్నీలో దుమ్ములేపిన రో – కో జోడి..9 వికెట్ల తేడాతో భారత్‌కు ఘన విజయం!

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తొలి రెండు వన్డేల్లో ఓటమి పాలైన టీమిండియా.. సిడ్నీ వేదికగా జరిగిన చివరిదైన మూడో వన్డేలో మాత్రం అదరగొట్టింది. తమ రెండు అగ్రశ్రేణి బ్యాటర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పవర్-ప్యాక్డ్ ప్రదర్శనతో భారత్ ఈ మ్యాచ్‌ను వన్ సైడ్ చేసి 9 వికెట్ల తేడాతో గెలిచి, సిరీస్‌ను విజయంతో ముగించింది.

IND vs AUS 3rd ODI : సిడ్నీలో దుమ్ములేపిన రో - కో జోడి..9 వికెట్ల తేడాతో భారత్‌కు ఘన విజయం!
Sydney Odi
Rakesh
|

Updated on: Oct 25, 2025 | 3:56 PM

Share

IND vs AUS 3rd ODI : ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తొలి రెండు వన్డేల్లో ఓటమి పాలైన టీమిండియా.. సిడ్నీ వేదికగా జరిగిన చివరిదైన మూడో వన్డేలో మాత్రం అదరగొట్టింది. తమ రెండు అగ్రశ్రేణి బ్యాటర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పవర్-ప్యాక్డ్ ప్రదర్శనతో భారత్ ఈ మ్యాచ్‌ను వన్ సైడ్ చేసి 9 వికెట్ల తేడాతో గెలిచి, సిరీస్‌ను విజయంతో ముగించింది. యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా నాలుగు వికెట్లతో ఆస్ట్రేలియాను 236 పరుగులకే కట్టడి చేయగా, రోహిత్ సెంచరీ, కోహ్లీ హాఫ్ సెంచరీతో టీమిండియాకు ఘన విజయాన్ని అందించాయి.

ఈ సిడ్నీ వన్డేలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు భారత బౌలర్ల ధాటికి 50 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. కేవలం 46.4 ఓవర్లలోనే 236 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత్ తరఫున యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించాడు. వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్‌లకు చెరో వికెట్ లభించింది.

ఆస్ట్రేలియా బ్యాటర్లలో మాట్ రెన్షా ఒక్కడే 50 పరుగుల మార్కును దాటి 56 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, భారత్‌కు శుభ్‌మన్ గిల్ రూపంలో 69 పరుగుల వద్ద తొలి ఎదురుదెబ్బ తగిలింది. గిల్‌ను జోష్ హేజిల్‌వుడ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో కలిసి ఆస్ట్రేలియా బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు.

ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి 168 పరుగుల మ్యాచ్-విన్నింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యం కారణంగా భారత్ కేవలం ఒక్క వికెట్ కోల్పోయి 38.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది, ఇంకా 69 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. రోహిత్ శర్మ 125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. విరాట్ కోహ్లీ 81 బంతుల్లో 7 ఫోర్లతో 74 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

తొలి రెండు వన్డేల్లో వైఫల్యం తర్వాత టీమిండియా ఈ సిడ్నీ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఈ వన్ సైడ్ విజయంతో ఆస్ట్రేలియా పర్యటనను భారత్ విజయవంతంగా ముగించింది. ఆస్ట్రేలియా తరఫున జోష్ హేజిల్‌వుడ్ ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..