IPL 2025: వారం తర్వాత ఇదే పరిస్థితి.. కట్చేస్తే.. ఐపీఎల్ విజేతగా నిలిచే జట్టు ఏదంటే?
రజత్ పాటిదార్ కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్లో చాలా బాగా ఆడింది. పాటీదార్ కెప్టెన్సీలో, ఆర్సిబి ఇప్పటివరకు మొత్తం 11 మ్యాచ్లు ఆడింది. వాటిలో 8 గెలిచి 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. అదే సమయంలో, RCB 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది. గుజరాత్, RCB సమాన పాయింట్లు కలిగి ఉన్నప్పటికీ, గుజరాత్ టైటాన్స్ మెరుగైన నెట్ రన్ రేట్ కలిగి ఉండటం వల్ల ప్రయోజనం ఉండవచ్చు.

IPL 2025: భారత్, పాకిస్తాన్ మధ్య ప్రస్తుత పరిస్థితులతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ను బీసీసీఐ ఒక వారం పాటు వాయిదా వేసింది. పాకిస్తాన్ సైన్యం నిరంతరం భారత నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ దుశ్చర్యలకు భారత దళాలు తగిన సమాధానం ఇస్తున్నాయి. గురువారం ధర్మశాలలో జరగాల్సిన పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కూడా భద్రతా కారణాల దృష్ట్యా మధ్యలో నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆటగాళ్లందరినీ హోటల్కు తిరిగి పంపించారు. ప్రేక్షకులను కూడా ఇంటికి పంపించారు. అయితే, IPL 2025 పూర్తిగా రద్దు చేయకుండా.. కేవలం ఒక వారం వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అయితే, పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఐపీఎల్ రద్దయ్యే ఛాన్స్ ఉంది. దీంతో ఏ జట్టుకు టైటిల్ విజేతగా నిలవనుందో ఇప్పుడు చూద్దాం..
IPL 2025 టైటిల్ విజేతగా గుజరాత్..
ఈ సంవత్సరం భారత జట్టుకు చాలా బిజీగా ఉండబోతోంది. ఎందుకంటే, ఈ సీజన్లో టీం ఇండియా చాలా కీలక సిరీస్లు ఆడవలసి ఉంది. ఇది వచ్చే నెల జూన్లో ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్తో ప్రారంభమవుతుంది. జూన్కు ముందు భారతదేశం మళ్ళీ IPL 2025 ను నిర్వహించడంలో విఫలమైతే, జట్టు ట్రోఫీని గుజరాత్ టైటాన్స్కు అప్పగించవచ్చు. నిజానికి, శుభ్మాన్ గిల్ టీం గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అలాగే గుజరాత్ నికర రన్ రేట్ 0.793గా ఉంది. IPL 2025 రద్దు చేస్తే, గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండే ప్రయోజనాన్ని పొందుతుంది. దీంతో ఛాంపియన్గా పరిగణించనున్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ ఎదురుదెబ్బ ..
రజత్ పాటిదార్ కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్లో చాలా బాగా ఆడింది. పాటీదార్ కెప్టెన్సీలో, ఆర్సిబి ఇప్పటివరకు మొత్తం 11 మ్యాచ్లు ఆడింది. వాటిలో 8 గెలిచి 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. అదే సమయంలో, RCB 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది. గుజరాత్, RCB సమాన పాయింట్లు కలిగి ఉన్నప్పటికీ, గుజరాత్ టైటాన్స్ మెరుగైన నెట్ రన్ రేట్ కలిగి ఉండటం వల్ల ప్రయోజనం ఉండవచ్చు. గుజరాత్ నెట్ రన్ రేట్ 0.793 కాగా, ఆర్సీబీ నెట్ రన్ రేట్ 0.482. ఈ విధంగా, IPL 2025 రద్దు తర్వాత, గుజరాత్ టైటాన్స్ను టైటిల్ విజేతగా ప్రకటించవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..