Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్థరాత్రి లేచి టిఫిన్ బాక్స్ పెట్టే అమ్మ.. ప్రాక్టీస్ కోసం భూమి అమ్మిన తండ్రి.. వైభవ్ కన్నీటి కథ మీకోసం

Vaibhav Suryavanshi Struggle Story: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ తరపున అద్భుతమైన సెంచరీ సాధించిన వైభవ్ సూర్యవంశీ,  తన కన్నీటి కథను పంచుకున్నాడు. తన కుటుంబం మొత్తం తన కోసం ఎలా కష్టాలను ఎదుర్కొందో వైభవ్ చెప్పుకొచ్చాడు.

అర్థరాత్రి లేచి టిఫిన్ బాక్స్ పెట్టే అమ్మ.. ప్రాక్టీస్ కోసం భూమి అమ్మిన తండ్రి.. వైభవ్ కన్నీటి కథ మీకోసం
Vaibhav Suryavanshi Mother
Follow us
Venkata Chari

|

Updated on: Apr 29, 2025 | 12:41 PM

Vaibhav Suryavanshi Struggle Story: మార్చి 27, 2011న, బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలోని తాజ్‌పూర్ గ్రామంలోని సంజీవ్ సూర్యవంశీ ఇంట్లో ఒక బిడ్డ జన్మించాడు. అతనికి వైభవ్ అని పేరు పెట్టారు. వైభవ్ పుట్టిన సమయంలో, అతని తండ్రి తన ముద్దుల కొడుకును క్రికెటర్‌గా చేయాలని నిర్ణయించుకున్నాడు. సంజీవ్ సూర్యవంశీ ఆ కలను నిజం చేయాలని కోరుకున్నాడు. కానీ దానిని నెరవేర్చే బాధ్యత అబోధ్ వైభవ్ పై ఉంది. వైభవ్ వయసులో ఉన్న పిల్లలు స్కూల్ బ్యాగులను వీపుపై పెట్టుకుని స్కూల్‌కి వెళ్తుంటే.. అతను బ్యాట్, బాల్ ఉన్న క్రికెట్ కిట్ బ్యాగ్‌ని వీపు మీద మోసుకెళ్ళేవాడు. దీంతో పాటు, అతను శిక్షణ కోసం తన ఇంటి నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణించేవాడు.

అర్జున్ లాగే, వైభవ్ కూడా తన తండ్రి కలను నెరవేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇలాంటి పరిస్థితిలో కుటుంబం మొత్తం అతనికి అండగా నిలచింది. వైభవ్ కృషి, త్యాగం కారణంగానే అతను కేవలం 14 సంవత్సరాల వయసులోనే చర్చల్లోకి వచ్చేశాడు. 14 సంవత్సరాల వయసులో, వైభవ్ ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. వైభవ్ పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ విజయం తర్వాత, వైభవ్ తన కన్నీటి కథను చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

రాత్రి 2 గంటలకే నిద్రలేపిన వైభవ్ తల్లి..

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించిన వైభవ్ సూర్యవంశీ, తనతో పాటు తన కుటుంబం మొత్తం తనను క్రికెటర్‌గా తీర్చిదిద్దడానికి కష్టపడ్డారంటూ చెప్పుకొచ్చాడు. అతను మాట్లాడుతూ, ‘నేను శిక్షణకు వెళ్ళినప్పుడు, మా అమ్మ రాత్రి 2 గంటలకు నిద్రలేచి నాకు టిఫిన్ తయారు చేసేది. ఆమె రాత్రి 11 గంటలకల్లా నిద్రపోతుంది. నా వల్లే ఆమె 3 గంటలు మాత్రమే నిద్రపోయేది. నాన్న నాతో వెళ్ళేవారు. కాబట్టి, మా అన్నయ్య తన పని చూసుకునేవాడు. ఇంటిని నడపడం కష్టంగా మారుతున్న సమయం వచ్చింది. డబ్బు కొరత ఉంది. కానీ, నేను కష్టపడి పనిచేయడానికి వెనుకాడలేదు. ఈ రోజు దేవుడు దానికి ప్రతిఫలమిచ్చాడు. ఈ విజయం వెనుక నా కుటుంబం మొత్తం ఉందంటూ చెప్పుకొచ్చాడు.

అతను మాట్లాడుతూ, ‘ఇప్పుడు నేను ఇంకా బాగా చేయాలి, జట్టుకు వీలైనంత వరకు సహకరించాలి. నేను ట్రయల్స్‌కి వెళ్ళినప్పుడు, అక్కడ విక్రమ్ రాథోడ్ సర్‌ని కలిశాను. నేను ట్రయల్స్‌లో బాగా రాణించినప్పుడు, మేనేజర్ నన్ను రాహుల్ సర్‌తో మాట్లాడేలా చేశాడు. రాహుల్ ద్రవిడ్ సర్ పర్యవేక్షణలో శిక్షణ పొందడం ఏ క్రికెటర్‌కైనా ఒక కల లాంటిది. జట్టులోని సీనియర్ ఆటగాళ్లందరి నుంచి కూడా నాకు మద్దతు లభిస్తుంది. కాబట్టి నాపై ఎటువంటి ఒత్తిడి లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..