AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND VS NZ: బ్లాక్‌లో ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్లు.. హైదరాబాదీ యువకుడి అరెస్ట్‌

భారత్-న్యూజిలాండ్ జరగాల్సిన క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌ కు సంబంధించి నకిలీ టికెట్లు విక్రయిస్తున్న హైదరాబాద్‌ వ్యక్తిని హిమాచల్ ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద లభించిన రెండు మొబైల్ ఫోన్లు, పలు టిక్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిని స్టేడియం సమీపంలో పట్టుకున్నట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ హితేష్ లఖన్‌పాల్ తెలిపారు. స్టేడియం బయట అనుమానంగా తచ్చాడుతున్న

IND VS NZ: బ్లాక్‌లో ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్లు.. హైదరాబాదీ యువకుడి అరెస్ట్‌
India Vs New Zealand
Basha Shek
|

Updated on: Oct 21, 2023 | 9:54 AM

Share

భారత్-న్యూజిలాండ్ జరగాల్సిన క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌ కు సంబంధించి నకిలీ టికెట్లు విక్రయిస్తున్న హైదరాబాద్‌ వ్యక్తిని హిమాచల్ ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద లభించిన రెండు మొబైల్ ఫోన్లు, పలు టిక్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిని స్టేడియం సమీపంలో పట్టుకున్నట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ హితేష్ లఖన్‌పాల్ తెలిపారు. స్టేడియం బయట అనుమానంగా తచ్చాడుతున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి సుమారు 8 టిక్కెట్లు, 8 వేల రూపాయలు, రెండు మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. యువకుల నుంచి రికవరీ చేసిన టిక్కెట్ల ధరలు రూ.1,500 నుంచి రూ.2,000 వరకు ఉన్నాయి. నకిలీ టిక్కెట్లు ఎక్కడి నుంచి వచ్చాయని అడగగా, ఆ యువకుడు పలువురి పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు వారి కోసం కూడా అన్వేషిస్తున్నారు. ఆదివారం ధర్మశాల వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుండగా, ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. దీనినే అవకాశంగా తీసుకున్న కొందరు వ్యక్తులు టికెట్ల బ్లాక్‌ మార్కెటింగ్‌కు తెర లేపుతున్నాడు. ఇలాంటి టికెట్లు కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

టాప్ పై గురి..

ఇవి కూడా చదవండి

కాగా స్వదేశంలో జరుగుతున్న వరల్డ్‌ కప్‌లో భారత జట్టు దూసుకెళుతోంది. ఇప్పటికే నాలుగు వరుస విజయాలు సాధించిన టీమిండియా ఇప్పుడు తమ తదుపరి మ్యాచ్‌లో బలమైన కివీస్ దళాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. పూణెలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడిన రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా, న్యూజిలాండ్ తలపడేందుకు ఇప్పటికే ధర్మశాలకు వెళ్లింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్రపంచ కప్ పాయింట్ల జాబితాలో నంబర్ 1 స్థానాన్ని పొందుతుంది. కాబట్టి ఈ విజయం ఇరు జట్లకు తప్పనిసరి. ధర్మశాల చేరుకున్న భారత జట్టు శనివారం ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటుంది. మరోవైపు అఫ్గానిస్థాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో విజయం సాధించిన న్యూజిలాండ్ ధర్మశాలలో ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించింది.

ధర్మశాలకు చేరుకున్న టీమిండియా

భారత ప్రాబబుల్ స్క్వాడ్:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ / మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం