AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అభిమానులకు షాకిచ్చిన ఐసీసీ.. రోహిత్, కోహ్లీ చివరి ప్రపంచకప్‌నకు ముందే జైషా సంచలన నిర్ణయం..?

ICC 2027 World Cup Format Change: క్రికెట్‌ను వ్యాపార కోణంలో చూస్తూ, ప్రేక్షకుల సమయాన్ని ఆదా చేసేందుకే ఐసీసీ ఈ అడుగులు వేస్తోంది. అయితే క్రీడా స్ఫూర్తిని, చిన్న దేశాల ఎదుగుదలను పక్కన పెట్టి కేవలం లాభాల కోసమే ఇలాంటి మార్పులు చేయడం ఎంతవరకు సమంజసమనేది పెద్ద ప్రశ్న. రోహిత్, కోహ్లీల వీడ్కోలు టోర్నీగా భావిస్తున్న 2027 ప్రపంచకప్ కొత్త ఫార్మాట్‌తో ఎలాంటి ఉత్కంఠను రేపుతుందో చూడాలి.

అభిమానులకు షాకిచ్చిన ఐసీసీ.. రోహిత్, కోహ్లీ చివరి ప్రపంచకప్‌నకు ముందే జైషా సంచలన నిర్ణయం..?
Icc 2027 World Cup Format Change
Venkata Chari
|

Updated on: Jul 14, 2026 | 12:15 PM

Share

ICC 2027 World Cup Format Change: భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ కెరీర్‌లో చివరి వన్డే ప్రపంచకప్ ఆడేందుకు సిద్ధమవుతున్న వేళ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఒక సంచలన మార్పునకు శ్రీకారం చుట్టబోతోంది. జై షా నేతృత్వంలోని ఐసీసీ తీసుకోబోయే ఈ అనూహ్య నిర్ణయం ఇప్పుడు ప్రపంచ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఆఖరి పోరుకు ముందే ఊహించని మార్పు..!

వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటారు. 2027లో జరగబోయే వన్డే ప్రపంచకప్ ఈ ఇద్దరు దిగ్గజాలకు ఆఖరిది కానుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మెగా టోర్నీ ప్రారంభానికి మరో 15 నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో, ఐసీసీ టోర్నమెంట్ ఫార్మాట్‌ను మార్చడానికి ముమ్మరంగా చర్చిస్తోంది. గతంలో ప్రకటించిన నిబంధనలను పక్కన పెట్టి, సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని భావిస్తుండటం గమనార్హం.

14 జట్లు అనుకుంటే.. 12 జట్లకే పరిమితం?

గత 2023 వన్డే ప్రపంచకప్‌ను కేవలం 10 జట్లతోనే నిర్వహించారు. అయితే, క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలనే ఉద్దేశంతో 2027, 2031 ప్రపంచకప్‌లలో జట్ల సంఖ్యను 14కు పెంచుతామని 2021 జూన్‌లోనే ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. కానీ, తాజా సమాచారం ప్రకారం ఐసీసీ తన పాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే యోచనలో ఉంది. రాబోయే టోర్నీలో 14 జట్లకు బదులుగా కేవలం 12 జట్లను మాత్రమే బరిలోకి దించాలని జై షా నేతృత్వంలోని బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎడిన్‌బర్గ్‌లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో బ్రాడ్‌కాస్టర్లు (ప్రసార సంస్థలు) సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

వ్యాపార ప్రయోజనాల కోసమేనా ఈ వ్యూహం?

ఐసీసీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ప్రేక్షకుల ఫోకస్, అలాగే వ్యాపార లాభాలేనని స్పష్టమవుతోంది. 2023లో 10 జట్లతో జరిగిన ప్రపంచకప్ దాదాపు నెలన్నర రోజుల పాటు సాగింది. ఒకవేళ జట్ల సంఖ్యను 14కు పెంచితే టోర్నమెంట్ వ్యవధి ఏకంగా రెండు నెలలకు చేరుకుంటుంది. ఈ రోజుల్లో టీ20 మ్యాచ్‌లు కేవలం నాలుగు గంటల్లో ముగిసిపోతుండటంతో, వన్డే మ్యాచ్‌ల సుదీర్ఘ సమయాన్ని భరించేందుకు ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇటీవలి ఐపీఎల్ 2026 సీజన్‌లో కూడా సుదీర్ఘ షెడ్యూల్ కారణంగా రేటింగులు తగ్గిన విషయాన్ని ఐసీసీ నిపుణులు గుర్తు చేస్తున్నారు. అందుకే టోర్నీని నిడివి తగ్గించి, రసవత్తరంగా మార్చాలని చూస్తున్నారు.

చిన్న దేశాల ఆశలపై నీళ్లు..!

ఐసీసీ కనుక 12 జట్ల ప్రతిపాదనకే మొగ్గు చూపితే, అసోసియేట్ (చిన్న) దేశాల ప్రపంచకప్ కల కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఎక్కువ జట్లు ఉంటే తమకు అవకాశం దక్కుతుందని ఆశించిన చిన్న దేశాలకు ఇది కోలుకోలేని దెబ్బేనని చెప్పాలి. కేవలం టెలివిజన్ ప్రసారాల ద్వారా వచ్చే ప్రకటనల ఆదాయం, తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను అర్జించడం కోసమే ఐసీసీ ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటోందనే విమర్శలు కూడా వస్తున్నాయి. రోహిత్, విరాట్‌ల ఆఖరి ప్రపంచకప్‌ను మరింత ప్రత్యేకంగా మార్చాలనుకున్న అభిమానులకు ఈ ఫార్మాట్ మార్పుల వార్త ఒకింత నిరాశను కలిగిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రోహిత్, కోహ్లీ చివరి ప్రపంచకప్‌నకు ముందే జైషా సంచలన నిర్ణయం..?
రోహిత్, కోహ్లీ చివరి ప్రపంచకప్‌నకు ముందే జైషా సంచలన నిర్ణయం..?
శక్తివంతమైన గ్రహాలు ఢీ.. వీరి కెరీర్‌కు ముప్పే
శక్తివంతమైన గ్రహాలు ఢీ.. వీరి కెరీర్‌కు ముప్పే
ఆ హీరోకి కారు డ్రైవింగ్ నేర్పింది నేనే..
ఆ హీరోకి కారు డ్రైవింగ్ నేర్పింది నేనే..
ఆషాఢం అమావాస్య రోజే దిశ మార్చుకుంటున్న గురుడు.. వీరికి సమస్యలే
ఆషాఢం అమావాస్య రోజే దిశ మార్చుకుంటున్న గురుడు.. వీరికి సమస్యలే
ఒకే క్లిక్‌తో పీఎఫ్ క్లెయిమ్ స్టేటస్ తెలుసుకోవచ్చు.. ఎలానో చూడండి
ఒకే క్లిక్‌తో పీఎఫ్ క్లెయిమ్ స్టేటస్ తెలుసుకోవచ్చు.. ఎలానో చూడండి
ఎంత పని చేశావ్ భారతీ.. ఇద్దరు చిన్నారులను చంపి, ఆపై ఆత్మహత్య
ఎంత పని చేశావ్ భారతీ.. ఇద్దరు చిన్నారులను చంపి, ఆపై ఆత్మహత్య
బరువు తగ్గేందుకు సూపర్ ఫుడ్.. ఇలా చేస్తే ఇట్టే మొలకలు వస్తాయ్..
బరువు తగ్గేందుకు సూపర్ ఫుడ్.. ఇలా చేస్తే ఇట్టే మొలకలు వస్తాయ్..
ఈ యాప్‌తో మీ చూట్టుపక్కల పాములు ఉన్నాయో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు
ఈ యాప్‌తో మీ చూట్టుపక్కల పాములు ఉన్నాయో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు
ఇలా చారు పెట్టి అన్నంలో పోసుకుంటే.. జీర్ణ సమస్యలన్నీ ఫట్ అంతే..
ఇలా చారు పెట్టి అన్నంలో పోసుకుంటే.. జీర్ణ సమస్యలన్నీ ఫట్ అంతే..
షాపింగ్ చేసేవారికి బ్యాడ్ న్యూస్.. ఇకపై అన్నీ ఆఫర్లు బంద్..
షాపింగ్ చేసేవారికి బ్యాడ్ న్యూస్.. ఇకపై అన్నీ ఆఫర్లు బంద్..