AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: వేలానికి ముందే వీళ్లకు రూ. 20 కోట్లు.. ఆ ముగ్గురికి స్పెషల్ ఆఫరిచ్చిన ఫ్రాంచైజీలు?

3 Players May Retained More Than Rs 20 Crores: ఐపీఎల్ మెగా వేలానికి రంగం రెడీ అయింది. ఇఫ్పటికే అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్, రిలీజ్ ప్లేయర్ల జాబితాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఎందుకంటే, ఈ జాబితాను అక్టోబర్ చివరిలోపు అందిచాల్సి ఉంది. అయితే, వేలానికి ముందే కొందరి ప్లేయర్లపై కోట్ల వర్షం కురనుంది. ఈ లిస్టులో ముగ్గురు ప్లేయర్లు ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం..

IPL 2025: వేలానికి ముందే వీళ్లకు రూ. 20 కోట్లు.. ఆ ముగ్గురికి స్పెషల్ ఆఫరిచ్చిన ఫ్రాంచైజీలు?
Ipl 2024
Venkata Chari
|

Updated on: Oct 21, 2024 | 8:19 AM

Share

3 Players May Retained More Than Rs 20 Crores: నవంబర్ చివరి వారంలో జరగనున్న IPL 2025 మెగా వేలం గురించి చాలా మంది క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వేలానికి ముందు, BCCI అన్ని ఫ్రాంచైజీలు గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతించింది. వీరిని నేరుగా రిటైన్ చేసుకోవచ్చు లేదా RTM కార్డును కూడా ఉపయోగించవచ్చు. ఈసారి కూడా రిటెన్షన్‌కు సంబంధించి బీసీసీఐ కొన్ని భిన్నమైన నిబంధనలను రూపొందించింది. ఇటువంటి పరిస్థితిలో, కొంతమంది క్యాప్డ్ ప్లేయర్‌లు మెగా వేలానికి ముందే భారీ నగదును పొందవచ్చు. ఐపీఎల్ 2025కి ముందు రూ. 20 కోట్లకు పైగా రిటైన్ చేయగల ముగ్గురు ఆటగాళ్లను ఓసారి చూద్దాం.

3. రషీద్ ఖాన్..

ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలో భాగమైన ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ ఈ జాబితాలో చేరాడు. ఐపీఎల్ 2024లో గుజరాత్ తరపున ఆడేందుకు రషీద్ ఖాన్ భారీ మొత్తంలో రూ.15 కోట్లు అందుకున్నాడు. IPL 2025కి కూడా గుజరాత్ ఖచ్చితంగా రషీద్ ఖాన్‌ను రిటైన్ చేస్తుందని పూర్తి ఆశ ఉంది. ఇందుకోసం ఫ్రాంచైజీ రూ.20 కోట్లకు పైగా వెచ్చించాల్సి వచ్చినా.. ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. టీ20 ఫార్మాట్‌లో రషీద్‌ ఎంత ప్రమాదకర ఆటగాడో అందరికీ తెలిసిందే. అతను ప్రపంచవ్యాప్తంగా T20 లీగ్‌లలో ఆడిన అనుభవం ఉంది. ఫ్రాంచైజీ దాని ప్రయోజనాన్ని కొనసాగించాలనుకుంటోంది.

2. నికోలస్ పూరన్..

IPL 2025 కోసం వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రిటైన్ చేస్తుందని ఇప్పటికే మీడియా నివేదికలలో వినిపిస్తోంది. గత మూడు సీజన్‌లలో ఎల్‌ఎస్‌జీకి ఆడుతున్న పూరన్.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. పూరన్ తన బ్యాటింగ్ ద్వారా మ్యాచ్ గమనాన్ని ఈజీగా మార్చేసే సత్తా ఉన్న ఆటగాడని ఫ్రాంచైజీకి కూడా బాగా తెలుసు.

1. జస్ప్రీత్ బుమ్రా..

భారత జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా పేరుగాంచారు. బుమ్రా బౌలింగ్ ఆడేందుకు స్టార్ బ్యాట్స్‌మెన్స్ కూడా భయపడతారు. ఐపీఎల్‌లోనూ అతని పూర్తి ఆధిపత్యం కనిపిస్తోంది. అతను తన బౌలింగ్ ఆధారంగా ముంబై ఇండియన్స్‌ను చాలా మ్యాచ్‌లను గెలిపించాడు. ఈ కారణంగానే అతడిని ఎట్టిపరిస్థితుల్లోనూ విడుదల చేయాలనే ఆలోచన ముంబయికి దక్కదు. ఈసారి ఐపీఎల్ 2025 కోసం రూ.20 కోట్లకుపైగా ఇచ్చైనా సరే బుమ్రాను ఉంచుకోవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..