AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CWC 2023, Rohit Sharma: లక్నోలో రోహిత్ స్పెషల్ మ్యాచ్.. దిగ్గజాల సరసన చేరిన హిట్‌మ్యాన్..

రోహిత్ శర్మ తన కెప్టెన్సీ కెరీర్‌ను 2017లో శ్రీలంకపై వన్డే ఫార్మాట్‌లో ప్రారంభించాడు. అదే సమయంలో, అతను 2021లో వైట్ బాల్, 2022లో రెడ్ బాల్‌కు పూర్తి సమయం కెప్టెన్ అయ్యాడు. ఇప్పటి వరకు 9 టెస్టులు, 40 వన్డేలు, 51 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ విధంగా కెప్టెన్‌గా రోహిత్ శర్మ సెంచరీ చేశాడు.

CWC 2023, Rohit Sharma: లక్నోలో రోహిత్ స్పెషల్ మ్యాచ్.. దిగ్గజాల సరసన చేరిన హిట్‌మ్యాన్..
రోహిత్ శర్మ ఇప్పటికి 40-45 సెంచరీలు చేసి ఉండేవాడు. కానీ, సెంచరీలను అంతగా పట్టించుకోడు. అతను తన కోసం కాకుండా జట్టు కోసం ఆడతాడు.ప్రస్తుత ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతను ఇప్పటివరకు అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో కూడా ఇలాగే దూసుకపోవాలని తెలిపాడు.
Venkata Chari
|

Updated on: Oct 29, 2023 | 4:07 PM

Share

ICC ODI ప్రపంచ కప్ 2023 (CWC 2023)లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ (IND vs ENG) మధ్య 29వ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుని భారత్‌కు బ్యాటింగ్ అవకాశం ఇచ్చింది. టాస్ ఫలితం భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కు అనుకూలంగా లేదు. పవర్ ప్లే ముగిసే లోపే రెండు కీలక వికెట్లు ( గిల్ 9, కోహ్లీ 0) కోల్పోయింది. అనంతరం శ్రేయాస్ అయ్యర్ 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో రోహిత్, కేఎల్ రాహుల్ కీలక భాగస్వామ్యం దిశగా సాగుతున్నారు. అయితే, ఇదే మ్యాచ్‌లో రోహిత్ శర్మ పేరు మీద పెద్ద ఘనత నమోదైంది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ భారత కెప్టెన్‌గా రోహిత్‌కి 100వ మ్యాచ్ కాగా, ఈ ఘనత సాధించిన ఏడో భారతీయుడిగా నిలిచాడు.

రోహిత్ శర్మ తన కెప్టెన్సీ కెరీర్‌ను 2017లో శ్రీలంకపై వన్డే ఫార్మాట్‌లో ప్రారంభించాడు. అదే సమయంలో, అతను 2021లో వైట్ బాల్, 2022లో రెడ్ బాల్‌కు పూర్తి సమయం కెప్టెన్ అయ్యాడు. ఇప్పటి వరకు 9 టెస్టులు, 40 వన్డేలు, 51 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ విధంగా కెప్టెన్‌గా రోహిత్ శర్మ సెంచరీ చేశాడు.

ఇవి కూడా చదవండి

ఇప్పటివరకు, భారతదేశం తరపున 100 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఘనతలు మహేంద్ర సింగ్ ధోనీ (332), మహ్మద్ అజారుద్దీన్ (221), విరాట్ కోహ్లీ (213), సౌరవ్ గంగూలీ (196), కపిల్ దేవ్ (108), రాహుల్ ద్రవిడ్ (104)ల పేర్లతో నమోదయ్యాయి. అయితే ఇప్పుడు ఈ దిగ్గజాల జాబితాలోకి రోహిత్ శర్మ పేరు కూడా చేరిపోయాడు.

రోహిత్ శర్మను బీసీసీఐ కూడా అభినందించింది. 100 అంతర్జాతీయ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మకు బీసీసీఐ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక పోస్ట్ ద్వారా అభినందనలు తెలిపింది.

కెప్టెన్‌గా 100వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అభినందనలు అంటూ పోస్ట్ చేసింది.

ప్రస్తుత ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ బ్యాట్ చాలా మంచి ఫామ్‌లో ఉంది. ఇప్పటివరకు అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్‌గా 100వ మ్యాచ్‌లో హిట్‌మన్ భారీ ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను విజయపథంలో నడిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

18000 పరుగుల జాబితాలో రోహిత్..

ఇంగ్లండ్‌పై కీలక ఇన్నింగ్స్ ఆడుతోన్న రోహిత్ శర్మ 48 పరుగుల వద్ద అంతర్జాతీయంగా 18000 పరుగులను పూర్తి చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..