AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: 6 సిక్స్‌లు, 2 ఫోర్లు.. 214 స్ట్రైక్ రేట్‌తో పరుగులు.. ఐపీఎల్ 2023లో దడ పుట్టిస్తోన్న ప్లేయర్..

MS Dhoni Stats In IPL 2023: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజాతో కలిసి మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ధోనీ, జడేజా మధ్య 30 బంతుల్లో 59 పరుగుల భాగస్వామ్యం నెలకొని ఉన్నప్పటికీ ఓటమి తప్పలేదు.

IPL 2023: 6 సిక్స్‌లు, 2 ఫోర్లు.. 214 స్ట్రైక్ రేట్‌తో పరుగులు.. ఐపీఎల్ 2023లో దడ పుట్టిస్తోన్న ప్లేయర్..
Ms Dhoni
Venkata Chari
|

Updated on: Apr 13, 2023 | 9:18 PM

Share

MS Dhoni: రాజస్థాన్ రాయల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. జట్టును గెలిపించడానికి మహేంద్ర సింగ్ ధోనీ తన శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ, చెన్నై సూపర్ కింగ్స్ లక్ష్యానికి దూరంగానే నిలిచి, ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ 17 బంతుల్లో 32 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్నింగ్స్‌లో 1 ఫోర్, 3 సిక్సర్లు కొట్టాడు.

ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో కెప్టెన్ కూల్..

IPL 2023లో 41 ఏళ్ల మహేంద్ర సింగ్ ధోని బ్యాట్‌ నుంచి తుఫాన్ వేగంతో పరుగుల వర్షం కురుస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. భారత మాజీ కెప్టెన్ భారీ షాట్లను సులువుగా కొట్టేస్తున్నాడు. ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు మహేంద్ర సింగ్ ధోనీ 27 బంతులు ఆడాడు. ఈ 27 బంతుల్లో మహేంద్ర సింగ్ ధోనీ 58 పరుగులు చేశాడు. కాగా, అతను ఒక్కసారి మాత్రమే పెవిలియన్ చేరాడు. ఇది కాకుండా మహేంద్ర సింగ్ ధోని 2 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. అంటే, మహేంద్ర సింగ్ ధోని ఫోర్ల కంటే మూడు రెట్లు ఎక్కువ సిక్సర్లు కొట్టాడు. అదే సమయంలో ఈ సీజన్‌లో ఇప్పటివరకు కెప్టెన్ కూల్ స్ట్రైక్ రేట్ 214.81గా ఉంది.

రవీంద్ర జడేజాతో ధోనీ అద్భుతమైన భాగస్వామ్యం..

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజాతో కలిసి మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా మధ్య 30 బంతుల్లో 59 పరుగుల భాగస్వామ్యం ఉంది. అయితే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్ష్యానికి 3 పరుగుల దూరంలో ఉంది. మహేంద్ర సింగ్ ధోనీతో పాటు రవీంద్ర జడేజా 15 బంతుల్లో అజేయంగా 25 పరుగులు చేసినా జట్టు ఓటమిని తప్పించలేకపోయాడు. అదే సమయంలో, ఈ విజయం తర్వాత, సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ 6 పాయింట్లతో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..
నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..
స్టవ్ ఆన్ చేయకుండానే.. రుచికరమైన స్వీట్ ఎలా తయారు చేయాలో తెలుసా?
స్టవ్ ఆన్ చేయకుండానే.. రుచికరమైన స్వీట్ ఎలా తయారు చేయాలో తెలుసా?
70ఏళ్లు వచ్చిన పర్లేదు.. నాకు నచ్చితే రెండో పెళ్ళికి రెడీ
70ఏళ్లు వచ్చిన పర్లేదు.. నాకు నచ్చితే రెండో పెళ్ళికి రెడీ
రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయులు మృతి!
రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయులు మృతి!
రైతన్నలకు తీపి కబురు.. ఈ జిల్లాల్లో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు!
రైతన్నలకు తీపి కబురు.. ఈ జిల్లాల్లో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు!
రెండు సెంచరీలు కొట్టినా నా ఓటు వాడికే.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్
రెండు సెంచరీలు కొట్టినా నా ఓటు వాడికే.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్