AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: 6 సిక్స్‌లు, 2 ఫోర్లు.. 214 స్ట్రైక్ రేట్‌తో పరుగులు.. ఐపీఎల్ 2023లో దడ పుట్టిస్తోన్న ప్లేయర్..

MS Dhoni Stats In IPL 2023: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజాతో కలిసి మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ధోనీ, జడేజా మధ్య 30 బంతుల్లో 59 పరుగుల భాగస్వామ్యం నెలకొని ఉన్నప్పటికీ ఓటమి తప్పలేదు.

IPL 2023: 6 సిక్స్‌లు, 2 ఫోర్లు.. 214 స్ట్రైక్ రేట్‌తో పరుగులు.. ఐపీఎల్ 2023లో దడ పుట్టిస్తోన్న ప్లేయర్..
Ms Dhoni
Venkata Chari
|

Updated on: Apr 13, 2023 | 9:18 PM

Share

MS Dhoni: రాజస్థాన్ రాయల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. జట్టును గెలిపించడానికి మహేంద్ర సింగ్ ధోనీ తన శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ, చెన్నై సూపర్ కింగ్స్ లక్ష్యానికి దూరంగానే నిలిచి, ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ 17 బంతుల్లో 32 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్నింగ్స్‌లో 1 ఫోర్, 3 సిక్సర్లు కొట్టాడు.

ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో కెప్టెన్ కూల్..

IPL 2023లో 41 ఏళ్ల మహేంద్ర సింగ్ ధోని బ్యాట్‌ నుంచి తుఫాన్ వేగంతో పరుగుల వర్షం కురుస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. భారత మాజీ కెప్టెన్ భారీ షాట్లను సులువుగా కొట్టేస్తున్నాడు. ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు మహేంద్ర సింగ్ ధోనీ 27 బంతులు ఆడాడు. ఈ 27 బంతుల్లో మహేంద్ర సింగ్ ధోనీ 58 పరుగులు చేశాడు. కాగా, అతను ఒక్కసారి మాత్రమే పెవిలియన్ చేరాడు. ఇది కాకుండా మహేంద్ర సింగ్ ధోని 2 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. అంటే, మహేంద్ర సింగ్ ధోని ఫోర్ల కంటే మూడు రెట్లు ఎక్కువ సిక్సర్లు కొట్టాడు. అదే సమయంలో ఈ సీజన్‌లో ఇప్పటివరకు కెప్టెన్ కూల్ స్ట్రైక్ రేట్ 214.81గా ఉంది.

రవీంద్ర జడేజాతో ధోనీ అద్భుతమైన భాగస్వామ్యం..

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజాతో కలిసి మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా మధ్య 30 బంతుల్లో 59 పరుగుల భాగస్వామ్యం ఉంది. అయితే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్ష్యానికి 3 పరుగుల దూరంలో ఉంది. మహేంద్ర సింగ్ ధోనీతో పాటు రవీంద్ర జడేజా 15 బంతుల్లో అజేయంగా 25 పరుగులు చేసినా జట్టు ఓటమిని తప్పించలేకపోయాడు. అదే సమయంలో, ఈ విజయం తర్వాత, సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ 6 పాయింట్లతో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?