AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి వేదికలు ఖరారు చేసిన పాకిస్థాన్.. టీమిండియా మ్యాచ్‌లు ఎక్కడంటే?

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కోసం తాత్కాలిక షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అలాగే, ఈ టోర్నమెంట్ కోసం మూడు స్టేడియాలను ఫిక్స్ చేశారు. దీని ప్రకారం లాహోర్, కరాచీ, రావల్పిండిలో ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ మ్యాచ్‌ లు జరుగుతాయి.

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి వేదికలు ఖరారు చేసిన పాకిస్థాన్.. టీమిండియా మ్యాచ్‌లు ఎక్కడంటే?
India Vs Pakistan
Basha Shek
|

Updated on: May 02, 2024 | 7:42 PM

Share

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కోసం తాత్కాలిక షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అలాగే, ఈ టోర్నమెంట్ కోసం మూడు స్టేడియాలను ఫిక్స్ చేశారు. దీని ప్రకారం లాహోర్, కరాచీ, రావల్పిండిలో ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ మ్యాచ్‌ లు జరుగుతాయి. ముఖ్యంగా టీమ్ ఇండియా అన్ని మ్యాచ్‌లను లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు సమాచారం. అంటే భారత్ మ్యాచ్‌లను ఒకే స్టేడియంలో నిర్వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించిందని, తద్వారా ఆటగాళ్లకు అన్ని రకాల భద్రత కల్పించేందుకు పీసీబీ కట్టుబడి ఉందని ఐసీసీకి తెలిపింది. పైఆ లాహోర్ నగరం భారత సరిహద్దుకు దగ్గరగా ఉంది. ఇది భారతీయ అభిమానుల ప్రయాణాన్ని కూడా సులభతరం చేస్తుంది. దీని ద్వారా టీమిండియా అభిమానులు సులభంగా పాక్ వెళ్లేందుకు వీలుందని పాక్ క్రికెట్ బోర్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది.

భారత్ వెళుతుందా?

2006 నుంచి భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లలేదు. అయితే తదుపరి ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో జరగనుండడంతో ఇప్పుడు భారత జట్టు పాకిస్థాన్‌కు తెరలేపుతుందా లేదా అనే ప్రశ్న తలెత్తింది. ఎందుకంటే ICC టోర్నీలను తరలించాలంటే, నిర్దిష్ట కారణాలు ఉండాలి. టోర్నీని ఇక్కడికి తరలించేందుకు బీసీసీఐ భద్రతా కారణాలను వెల్లడించినప్పటికీ, ఇతర క్రికెట్ బోర్డులు కూడా చేతులు కలపాల్సి ఉంటుంది. అయితే ఇటీవల బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడాయి. ఈ హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీ నిర్వహిస్తే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చాలా నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి మ్యాచ్‌కి భారత్ ఇతర జట్లను యూఏఈ లేదా శ్రీలంకకు పంపాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ ముందుంచనుంది. కాగా, లాహోర్ కేంద్రంగా భారత్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు పాక్ క్రికెట్ బోర్డు ప్లాన్ చేసింది. దీని ద్వారా టీమ్ ఇండియాకు అన్ని రకాల భద్రతలు కల్పించబోతున్నామన్న వాదనను ఐసీసీ ముందుంచనుంది. కాబట్టి 2025 ఛాంపియన్స్ ట్రోఫీని మార్చడానికి BCCI ఎలాంటి కారణాలు చెబుతుందనేది ఆసక్తిగా ఉంది.

ఆసియా కప్ చివరి ఎడిషన్‌ పాక్‌లోనే జరిగింది. కానీ భారత జట్టు పాకిస్థాన్ వెళ్లేందుకు వెనుకాడడంతో టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించారు. దీని ప్రకారం, ఆసియా కప్ పాకిస్తాన్, శ్రీలంకలో నిర్వహించారు. ఇక్కడ భారత జట్టు శ్రీలంకలో ఫైనల్‌తో సహా అన్ని మ్యాచ్‌లు ఆడింది. మరి ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ వెళ్లడంపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్