T20 World Cup 2024: చాహల్‌కు టీ20 ప్రపంచ కప్‌లో ఛాన్స్.. భార్య ధనశ్రీ వర్మ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్

ప్రతిష్ఠాత్మక 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును ప్రకటించారు. ప్రపంచకప్‌కు ఎంపికైన ఆటగాళ్ల పేర్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ సోషల్ మీడియాలో ప్రకటించింది. టీమ్ ఇండియా ప్రధాన జట్టులో మొత్తం 15 మంది ఆటగాళ్లు ఉన్నారు. అలాగే 4 రిజర్వ్ ఆటగాళ్లను చేర్చారు.

T20 World Cup 2024: చాహల్‌కు టీ20 ప్రపంచ కప్‌లో ఛాన్స్.. భార్య ధనశ్రీ వర్మ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్
Yuzvendra Chahal Family
Follow us

|

Updated on: May 01, 2024 | 7:58 AM

ప్రతిష్ఠాత్మక 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును ప్రకటించారు. ప్రపంచకప్‌కు ఎంపికైన ఆటగాళ్ల పేర్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ సోషల్ మీడియాలో ప్రకటించింది. టీమ్ ఇండియా ప్రధాన జట్టులో మొత్తం 15 మంది ఆటగాళ్లు ఉన్నారు. అలాగే 4 రిజర్వ్ ఆటగాళ్లను చేర్చారు. రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా ప్రపంచకప్ లో అడుగుపెట్టనుంది. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. టీ 20 ప్రపంచకప్ ద్వారా చాలా మంది ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే కొందరు ప్రధాన జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. రిషబ్ పంత్ పునరాగమనంతో కేఎల్ రాహుల్‌కు ప్రపంచకప్ అవకాశం దక్కలేదని తెలుస్తోంది. రోడ్డు ప్రమాదం జరిగిన 15 నెలల తర్వాత రిషబ్ పంత్ ఐపీఎల్‌లో పునరాగమనం చేశాడు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. సంజు శాంసన్ కూడా టీమ్ లోకి ఎంపికయ్యాడు. సంజూ నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 17వ సీజన్‌లో నంబర్ 1 జట్టుగా అవతరించింది. అలాగే టీమ్ ఇండియా టాప్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా పునరాగమనం చేశాడు. చాహల్ పునరాగమనంలో ‘కుల్చా’ (కుల్దీప్-యుజ్వేంద్ర) జంట మళ్లీ ఒక్కటవుతుంది.

యుజ్వేంద్ర జట్టు దాదాపు 8 నెలల తర్వాత భారత్‌ జట్టు తరఫున ఆడనున్నాడు. చాహల్ చివరి T20 మ్యాచ్ 13 ఆగస్టు 2023న వెస్టిండీస్‌తో ఆడాడు. ఈ నేపథ్యంలో చాహల్ ప్రపంచకప్ జట్టులోకి ఎంపికైన వెంటనే, అతని భార్య ధన్‌శ్రీ వర్మ ఇన్‌స్టా స్టోరీ వైరల్‌గా మారింది. టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన టీమిండియా ఆటగాళ్ల ఫొటోను ధనశ్రీ ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. అలాగే ‘ హి ఈజ్ బ్యాక్’ అంటూ యుజ్వేంద్ర చాహల్‌ను ప్రస్తావిస్తూ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేసింది. ధన్‌శ్రీ ఇన్‌స్టాలో చేసిన ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

చాహల్ భార్య ధన శ్రీ వర్మ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ వైరల్..

View this post on Instagram

A post shared by Gupshup (@guppshuppp)

టీ20 ప్రపంచకప్‌ కోసం టీమిండియా:

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌ దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా , మహ్మద్ సిరాజ్.

రిజర్వ్‌లు:

శుభమాన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఏపీ పాలిసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల
ఏపీ పాలిసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల
టాప్ ఫిట్‌నెస్ ఫీచర్లతో కొత్త స్మార్ట్ వాచ్.. స్టైలిష్ డిజైన్..
టాప్ ఫిట్‌నెస్ ఫీచర్లతో కొత్త స్మార్ట్ వాచ్.. స్టైలిష్ డిజైన్..
Horoscope Today: వారికి అదనపు రాబడి బాగా పెరుగుతుంది..
Horoscope Today: వారికి అదనపు రాబడి బాగా పెరుగుతుంది..
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు