ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్: ఈ బామ్మ ‘ఫ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’
ప్రపంచ కప్లో భాగంగా మంగళవారం భారత్- బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ను 28పరుగుల తేడాతో కోహ్లీ సేన సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో భారత్ సెమీస్కు చేరింది. కాగా ఈ మ్యాచ్ కోసం భారత అభిమానులతో ఎడ్గ్బాస్టన్ స్టేడియం నిండిపోగా.. వారిలో ఓ బామ్మ అందరినీ ఆకట్టుకుంది. భారత ఆటగాళ్లు మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆమె చేసిన హుషారు చూసి యావత్తు సోషల్ మీడియా ఫిదా అయిపోయింది. నోటితో బూర ఊదుతూ కుర్ర అభిమానులతో కలిసి […]
ప్రపంచ కప్లో భాగంగా మంగళవారం భారత్- బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ను 28పరుగుల తేడాతో కోహ్లీ సేన సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో భారత్ సెమీస్కు చేరింది. కాగా ఈ మ్యాచ్ కోసం భారత అభిమానులతో ఎడ్గ్బాస్టన్ స్టేడియం నిండిపోగా.. వారిలో ఓ బామ్మ అందరినీ ఆకట్టుకుంది. భారత ఆటగాళ్లు మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆమె చేసిన హుషారు చూసి యావత్తు సోషల్ మీడియా ఫిదా అయిపోయింది. నోటితో బూర ఊదుతూ కుర్ర అభిమానులతో కలిసి ఆమె వేసిన కేరింతలకు అందరూ ఫ్యాన్లు అయిపోయారు. కొందరైతే ఆమె వద్దకు వెళ్లి సెల్ఫీలు తీసుకొని మరీ సోషల్ మీడియాలోపోస్ట్ చేశారు.
అంతేకాదు భారత క్రికెటర్లు కూడా ఆమె ఉత్సాహాన్ని చూసి ముచ్చటపడిపోయారు. దీంతో మ్యాచ్ ముగిసిన తరువాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తదితరులు ఆమె వద్దకు వెళ్లి మాట్లాడి ఫొటోలు తీసుకున్నారు. ఇక కామెంటేటర్స్ గంగూలి, హర్షా భోగ్లే కూడా ఆమె ఎనర్జీని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసి.. వయసు కేవలం సంఖ్య మాత్రమేనని వ్యాఖ్యానించారు. కాగా 87ఏళ్ల ఈ బామ్మగారి పేరు చారులతా పటేల్.
Cricket really is for all ages!
Meet the #TeamIndia fan whose support is simply sensational ?? #BANvIND | #CWC19 pic.twitter.com/4TaXCvSgzr
— Cricket World Cup (@cricketworldcup) July 2, 2019
How amazing is this?!
India's top-order superstars @imVkohli and @ImRo45 each shared a special moment with one of the India fans at Edgbaston.#CWC19 | #BANvIND pic.twitter.com/3EjpQBdXnX
— Cricket World Cup (@cricketworldcup) July 2, 2019