Rohit Sharma: రోహిత్ శర్మతో భేటీ కానున్న బీసీసీఐ పెద్దలు.. కెప్టెన్సీపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
భారత్ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ లో టీమిండియాను అజేయంగా ఫైనల్స్కు చేర్చాడు రోహిత్ శర్మ . అయితే ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో అనూహ్యంగా భారత్ కు పరాజయం ఎదురైంది. కాగా ఈ ఓటమితో వన్డేల్లో రోహిత్ శర్మ భవితవ్యంపై పలు సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

భారత్ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ లో టీమిండియాను అజేయంగా ఫైనల్స్కు చేర్చాడు రోహిత్ శర్మ . అయితే ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో అనూహ్యంగా భారత్ కు పరాజయం ఎదురైంది. కాగా ఈ ఓటమితో వన్డేల్లో రోహిత్ శర్మ భవితవ్యంపై పలు సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్ట్రేలియాతో రేపటి నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ నుంచి రోహిత్తో పాటు పలువురు ఆటగాళ్లకు విశ్రాంతి లభించింది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం.. హిట్మ్యాన్గా పేరొందిన రోహిత్ అంతర్జాతీయ టీ20 క్రికెట్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. దీనికి సంబంధించి ఆయన ఇప్పటికే భారత సెలక్టర్లతో మాట్లాడినట్లు కూడా నివేదిక పేర్కొంది. కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకే రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడని, టీ20 జట్టులోకి తనను ఎంపిక కాకపోయినా ఇబ్బంది లేదని రోహిత్ చెప్పినట్లు సమాచారం. కాగా హిట్ మ్యాన్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం అతని వన్డే కెరీర్పై కూడా ప్రశ్నలను లేవనెత్తింది. ఎందుకంటే తదుపరి వన్డే ప్రపంచకప్ 2027లో జరగనుంది. ప్రస్తుతం 36 ఏళ్ల వయసున్న రోహిత్కి అప్పుడు 40 ఏళ్లు ఉంటాయి. కాబట్టి ఆ వయసులో ఆ ప్రపంచకప్ టోర్నీలో ఆడగలడా అనేది ప్రశ్న. అంతకంటే ముందు 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా జరుగుతోంది, ఆ టోర్నీలో కూడా రోహిత్ ఆడుతాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
టీమిండియాకు కొత్త కెప్టెన్?
2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ, 2027 వన్డే ప్రపంచకప్ రెండింటికీ కొత్త కెప్టెన్తో టీమ్ ఇండియా రంగంలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రాబోయే రోజుల్లో వైట్ బాల్ అంటే వన్డే క్రికెట్ భవిష్యత్తు గురించి రోహిత్ శర్మతో చర్చిస్తుంది. తదుపరి వన్డే ప్రపంచకప్ 2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వేలో జరగనుంది. అప్పుడు రోహిత్ శర్మకు 40 ఏళ్లు ఉంటాయి. వచ్చే ఏడాది 2024లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ ప్రపంచకప్ టోర్నీ అమెరికా-వెస్టిండీస్లో జరగనుంది. అప్పుడు రోహిత్ శర్మ వయసు 37 ఏళ్లు. అప్పటి వరకు రోహిత్ టీమ్ ఇండియాకు ఆడే అవకాశాలు తక్కువే. విరాట్ కోహ్లీ కూడా ఇప్పటికే T20 ఫార్మాట్కు దూరంగా ఉన్నారు. తద్వారా రానున్న రోజుల్లో టీమ్ ఇండియాలో మార్పుల సీజన్ ప్రారంభం కానుంది.
వన్డే కెప్టెన్గా చివరి సిరీస్ అదేనా?
టీ20 క్రికెట్ ఆడటం తనకు ఇష్టం లేదని రోహిత్ ఇప్పటికే స్పష్టం చేశాడు. ఇప్పుడు వన్డేల్లో అతని భవిష్యత్తు గురించి సెలక్టర్లు అతనితో చర్చించనున్నారు. డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాలో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు ముందు టీమిండియా మూడు వన్డేలు ఆడనుంది. టెస్టుల్లో ఆడే ముందు సన్నద్ధమయ్యేందుకు సీనియర్లకు వన్డే సిరీస్ మంచి అవకాశమని బీసీసీఐ సెలక్టర్లు అభిప్రాయపడ్డారు. గాయం కారణంగా హార్దిక్ పాండ్యా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లడం లేదు. కాబట్టి దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మకు చివరి సిరీస్ కావచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








