AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: భారత్‌తో మ్యాచ్‌కు ముందు బంగ్లా టీంలో టెన్షన్.. గాయంతో కీలక ప్లేయర్ ఔట్..

India vs Bangladesh: చెన్నైలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయం కారణంగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ భారత్‌తో ఆడటం కష్టంగా మారింది. ఇక, ఈ ఉత్కంఠ బంగ్లాదేశ్ జట్టులో ఆందోళనను పెంచింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో షకీబ్ పరుగులు తీస్తుండగా గాయపడ్డాడు. అయితే, గాయం తర్వాత కూడా అతను తన బ్యాటింగ్‌ను కొనసాగించాడు. అతను 10 ఓవర్ల కోటాను కూడా బౌల్ చేశాడు.

IND vs BAN: భారత్‌తో మ్యాచ్‌కు ముందు బంగ్లా టీంలో టెన్షన్.. గాయంతో కీలక ప్లేయర్ ఔట్..
Ind Vs Ban
Venkata Chari
|

Updated on: Oct 17, 2023 | 9:35 AM

Share

2023 ప్రపంచకప్‌లో భారత్ ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల్లోనూ భిన్నమైన ఆటగాళ్లే భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే తర్వాతి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడాల్సి ఉంది. అయితే, టీమిండియాకు చెమటలు పట్టించేందుకు బంగ్లాదేశ్ సిద్ధమైంది. బంగ్లాదేశ్ తనదైన రోజున ఎలాంటి టీంకైనా షాక్ ఇస్తుంటుంది. కాగా, ఈ మ్యాచ్‌ కూడా అలానే ఉంటుందని అంతా భావిస్తున్నారు. కానీ, ఈ క్రమంలో బంగ్లాదేశ్ టీంకు బిగ్ షాక్ తగిలింది. బంగ్లా కీలక ప్లేయర్ షకీబ్ అల్ హసన్ గాయంతో జట్టులో ప్రస్తుతం టెన్షన్ వాతావారణం నెలకొంది.

చెన్నైలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయం కారణంగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ భారత్‌తో ఆడటం కష్టంగా మారింది. ఇక, ఈ ఉత్కంఠ బంగ్లాదేశ్ జట్టులో ఆందోళనను పెంచింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో షకీబ్ పరుగులు తీస్తుండగా గాయపడ్డాడు. అయితే, గాయం తర్వాత కూడా అతను తన బ్యాటింగ్‌ను కొనసాగించాడు. అతను 10 ఓవర్ల కోటాను కూడా బౌల్ చేశాడు. ఈ క్రమంలో నొప్పితో పోరాడుతున్నట్లు కనిపించాడు. అయితే, మ్యాచ్ అనంతరం చెన్నైలో అతడికి స్కానింగ్ చేయగా, గాయం తీవ్రత బయటపడింది.

భారత్‌తో మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్ ఆందోళనలు..

ఇప్పుడు బంగ్లాదేశ్ తన తదుపరి మ్యాచ్‌ని అక్టోబర్ 19న టీమ్ ఇండియాతో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ పుణెలో జరుగుతుంది. బంగ్లాదేశ్ జట్టు డైరెక్టర్ ఖలీద్ మహమూద్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు షకీబ్ మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పుణెలో ప్రాక్టీస్ సెషన్‌లో అతడిని నిశితంగా పరిశీలిస్తాం. షకీబ్ గాయం మెరుగుపడుతోందని మహమూద్ తెలిపాడు. నొప్పి లేదు. వికెట్ల మధ్య కూడా పరుగులు తీస్తున్నాడు. అయితే పూణేలో తుది నిర్ణయం తీసుకుంటాం. అతను భారత్‌తో ఆడేందుకు ఫిట్‌గా ఉంటాడని తెలుస్తోంది.

షకీబ్ అల్ హసన్ గురించి బంగ్లాదేశ్ ఆందోళన..

బంగ్లాదేశ్ జట్టు డైరెక్టర్ మాట్లాడుతూ షకీబ్ ఆడాలనుకుంటున్నాడు. గాయం తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లాగా అతను 85 నుంచి 90 శాతం ఫిట్‌గా ఉన్నట్లయితే, అతను ఆడతాడని మనం ఆశించవచ్చు. అయితే, అతను 100 శాతం ఫిట్‌గా ఉన్నాడా లేదా అనే దానిపై అంతా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మేం రిస్క్ తీసుకోలేం. ప్రపంచ కప్ 2023 క్యాంపెయిన్‌లో ఇంకా 6 మ్యాచ్‌లు మిగిలి ఉన్నందున మేం జాగ్రత్తగా ఉండాలి. తదుపరి మ్యాచ్ తర్వాత మొత్తం టోర్నమెంట్‌లో షకీబ్‌ను కోల్పోవడమే కాకుండా మా తొందరపాటు గందరగోళాన్ని సృష్టించడం మాకు ఇష్టం లేదు. భారత్‌తో షకీబ్ ఆడటంపై జట్టు ఫిజియో, డాక్టర్ తుది నిర్ణయం తీసుకుంటారు అని తెలిపాడు.