AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2023: ఆసియాకప్‌పై వీడిన సందిగ్ధత.. హైబ్రీడ్ మోడల్‌కు గ్రీన్ సిగ్నల్.. టీమిండియా మ్యాచ్‌లు ఎక్కడంటే?

PCB Hybrid Model: : ఆసియా కప్ 2023లో కీలక అప్‌డేట్ వచ్చింది. పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్‌కు ఆమోదం లభిస్తుందని, ఈ టోర్నమెంట్‌ను పాకిస్థాన్, శ్రీలంక దేశాలు ఆతిథ్యమిస్తున్నాయని చెబుతున్నారు.

Asia Cup 2023: ఆసియాకప్‌పై వీడిన సందిగ్ధత.. హైబ్రీడ్ మోడల్‌కు గ్రీన్ సిగ్నల్.. టీమిండియా మ్యాచ్‌లు ఎక్కడంటే?
Asia Cup 2023 Ind Vs Pak
Venkata Chari
|

Updated on: Jun 11, 2023 | 4:05 PM

Share

ఆసియా కప్ 2023కి సంబంధించి చాలా కాలంగా నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. టోర్నీని ఏ దేశంలో నిర్వహిస్తారనే దానిపై స్పష్టత వచ్చింది. తాజాగా బయటకు వచ్చిన రిపోర్ట్‌తో ఈ విషయం వెల్లడైంది. నివేదిక ప్రకారం, ఆసియా కప్ 2023 రెండు దేశాలు పాకిస్తాన్, శ్రీలంక దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అదే సమయంలో, టోర్నమెంట్ కోసం పాకిస్తాన్ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ కూడా ఆమోదించారంట. జూన్ 13 న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధికారికంగా ప్రకటించవచ్చని తెలుస్తోంది.

ఆసియా కప్ 2023 ఎక్కడ జరుగుతుందనే చర్చ చాలా కాలంగా కొనసాగుతోంది. అదే సమయంలో, ACC చీఫ్ జై షా త్వరలో పాకిస్తాన్ హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించవచ్చని తెలుస్తోంది. ‘పీటీఐ’ వార్తా సంస్థ కథనం ప్రకారం, ఈ టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్‌లు భారత్ మినహా పాకిస్థాన్‌లో జరుగుతాయి. కాగా, భారత్ వర్సెస్ పాకిస్థాన్, భారత్‌ల అన్ని మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నాయి. దీంతోపాటు వన్డే ప్రపంచకప్‌ కోసం పాకిస్థాన్‌ భారత్‌కు వస్తుందని, నరేంద్ర మోదీ స్టేడియంలో ఆడేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా నివేదికలో వెల్లడైంది.

ACC సభ్యుడు, ఒమన్ క్రికెట్ చీఫ్ పంకజ్ ఖిమ్జీ హోస్టింగ్ సమస్యను పరిష్కరించారని తెలుస్తోంది. భారత్‌ మ్యాచ్‌లు కాకుండా, మిగిలిన అన్ని మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరుగుతాయని, ఇందులో పాకిస్థాన్ వర్సెస్ నేపాల్, బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక, శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లు లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో జరుగుతాయని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, భారత్ వర్సెస్ పాకిస్థాన్, మిగతా భారత్ మ్యాచ్‌లు శ్రీలంకలోని గాలె లేదా పల్లెకెలెలో జరగుతాయంట.

ఇవి కూడా చదవండి

ACC బోర్డు సభ్యుడు మాట్లాడుతూ.. ఒక్క షరతుపై హైబ్రీడ్ మోడల్‌ను ఆమోదించినట్లు తెలిపారు. “అనేక దేశాలు హైబ్రిడ్ మోడల్‌ను కోరుకోనందున ఒక పరిష్కారాన్ని కనుగొన్నట్లు ఆయన తెలిపారు. ACC ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులలో ఒకరైన ఒమన్ క్రికెట్ బోర్డ్ చీఫ్ పంకజ్ ఖిమ్జీని నియమించారు. అయితే ప్రస్తుతానికి లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో నాలుగు నాన్-ఇండియా మ్యాచ్‌లు – పాకిస్తాన్ vs నేపాల్, బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ vs శ్రీలంక, శ్రీలంక vs బంగ్లాదేశ్ జరగనున్నాయి. భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య జరిగే రెండు మ్యాచ్‌లు, మిగతా సూపర్‌ ఫోర్‌ మ్యాచ్‌లు పల్లెకెలె లేదా గాలేలో జరుగుతాయని తెలిపారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..