AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్.. శ్రీలంక ఓటమితో తొలిసారి ఆ టోర్నీలో ఆడనున్న క్రికెట్ బేబీస్..

Champions Trophy 2025: మొత్తం ఎనిమిది జట్లు మాత్రమే ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయి. పాకిస్థాన్ స్వయంచాలకంగా ఆతిథ్య దేశంగా అర్హత సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈవెంట్‌లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు, భారతదేశం, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పాల్గొంటాయి. ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో మరో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. వీటిలో నేడు ఆసీస్ తో మ్యాచ్ జరుగుతోంది. సెమీస్‌ను ఖాయం చేసుకోవాలంటే ఈ రెండు మ్యాచ్‌లు గెలవాల్సిందే. ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.

Afghanistan: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్.. శ్రీలంక ఓటమితో తొలిసారి ఆ టోర్నీలో ఆడనున్న క్రికెట్ బేబీస్..
afghanistan-icc-world-cup
Venkata Chari
|

Updated on: Nov 07, 2023 | 3:39 PM

Share

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు తొలిసారిగా పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి అర్హత సాధించింది. ICC ODI ప్రపంచ కప్ 2023 లో బంగ్లాదేశ్‌తో శ్రీలంక ఓడిపోయిన తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్‌లో ఆఫ్ఘనిస్తాన్ పాల్గొనడం ఖాయమైంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘన్ జట్టు ఎప్పుడూ ఆడలేదు. తొలిసారి బరిలోకి దిగనుంది. ఆఫ్ఘనిస్థాన్ ప్రస్తుతం ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో నేడు కీలక మ్యాచ్ ఆడుతోంది.

ఛాంపియన్స్ ట్రోఫీకి మొత్తం ఎనిమిది జట్లు అర్హత..

పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తోంది కాబట్టి.. హోస్ట్ దేశంగా ఎంపికైంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈవెంట్‌లో పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు, భారతదేశం, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పాల్గొంటాయి. మరో రెండు స్థానాలు ఖరారు కావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు ఇంగ్లండ్, నెదర్లాండ్స్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఇంకా పోటీలో ఉన్నాయి. ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఎనిమిది జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడతాయి.

ఈ ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ అంచనాలకు మించి రాణిస్తోంది. 2015, 2019 ప్రపంచకప్‌లలో హష్మతుల్లా షాహిదీ నేతృత్వంలోని జట్టు ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది. కానీ, ఈసారి ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌, నెదర్లాండ్స్‌ జట్లను ఓడించి ఆఫ్ఘన్‌ ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ రేసులో నిలిచింది.

View this post on Instagram

A post shared by ICC (@icc)

ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో మరో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. వీటిలో నేడు ఆసీస్ తో మ్యాచ్ జరుగుతోంది. సెమీస్‌ను ఖాయం చేసుకోవాలంటే ఈ రెండు మ్యాచ్‌లు గెలవాల్సిందే. ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. తమ తదుపరి రెండు మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాను ఓడించినట్లయితే సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అయితే ఆఫ్ఘనిస్థాన్ తమ మ్యాచ్‌లలో ఒకటి లేదా రెండు ఓడిపోతే, న్యూజిలాండ్, పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లలో భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.

ఇరుజట్లు:

ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్) , ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మార్నస్ లాబుస్‌చాగ్నే, మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్.

ఆఫ్ఘనిస్తాన్: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్) , రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్ (వికెట్), రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..