Tirumala: శాస్త్రోక్తంగా చక్రదారుడి చక్రస్నానం.. రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాల ముగింపు..

నేటితో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనుండగా బ్రహ్మోత్సవాల్లో 9వ రోజు సాయంత్రం 7 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం జరగనుంది. అనంతరం రాత్రి 9 గంటలకు శాస్త్రొక్తంగా ధ్వజావరోహణం చేయనున్న అర్చకులు ద్వజావరోహణంతో 9 రోజులపాటు కన్నుల పండువగా జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముగింపు పలుకుతారు.

Tirumala: శాస్త్రోక్తంగా చక్రదారుడి చక్రస్నానం.. రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాల ముగింపు..
Chakrasnanam
Follow us

|

Updated on: Sep 26, 2023 | 12:02 PM

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో కీలకమైన ఆఖరి ఘట్టం చక్రస్నానం ముగిసింది. వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం జరిగింది. తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు స్వామివారికి పల్లకి ఉత్సవం నిర్వహించిన అర్చకులు అనంతరం ఆలయ ముఖ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి సుదర్శన చక్రతాళ్వార్ లకు స్నపన తిరుమంజనం ఆగమొక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీవారి పుష్కరిణిలో సుదర్శన చక్రతాళ్వార్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఉభయ దేవేరులతో కలిసి శ్రీవారి చక్రత్తాళ్వార్లకు అర్చకులు అభిషేకం నిర్వహించగా పుష్కరిణి నీటిలో చక్రతాళ్వార్ ను ముంచిన తరువాత భక్తులను చక్రస్నానికి అనుమతించింది టీటీడీ. చక్రస్నానంలో టిటిడి చైర్మన్, ఈవో తోపాటు పాలక మండలి సభ్యులు, పలువురు వీఐపీలు పాల్గొన్నారు.

నేటితో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనుండగా బ్రహ్మోత్సవాల్లో 9వ రోజు సాయంత్రం 7 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం జరగనుంది. అనంతరం రాత్రి 9 గంటలకు శాస్త్రొక్తంగా ధ్వజావరోహణం చేయనున్న అర్చకులు ద్వజావరోహణంతో 9 రోజులపాటు కన్నుల పండువగా జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముగింపు పలుకుతారు.

ఇవి కూడా చదవండి

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భారీ సంఖ్యలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గోవింద నామ స్మరణతో తిరుమల గిరులు మారుమ్రోగుతున్నాయి. తిరుమల ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..