AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

No Rush in Tirumala: తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్.. శ్రీవారి దర్శనానికి నో వెయిటింగ్..

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కొండకు చేరిన భక్తులకు గుడ్ న్యూస్. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడా క్యూలైన్ లో ఎక్కడా వేచి ఉండకుండా నేరుగా వెళ్లిపోయేటంత ఖాళీగా ఉంది. భక్తులు స్వామివారిని చాలా ఈజీగా దర్శించుకుంటున్నారు. ఈ మేరకు శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్న టీటీడీ నో వెయిటింగ్ రూల్ ను అమలు చేస్తోంది. రద్దీ తగ్గడంతో కంపార్ట్మెంట్ లలో ఎక్కడా భక్తులు వేచి ఉండకుండా నేరుగా దర్శనానికి అనుమతిస్తోంది. ప్రస్తుతం నేరుగా స్వామివారిని దర్శించుకుంటున్నారు.

No Rush in Tirumala: తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్.. శ్రీవారి దర్శనానికి నో వెయిటింగ్..
No Rush In Tirumala
Raju M P R
| Edited By: Ravi Kiran|

Updated on: Jul 31, 2023 | 9:34 AM

Share

తిరుమల తిరుపతి క్షేత్రంలో కలియుగ దైవం కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతుంటారు. గత కొన్ని రోజుల క్రితం వరకూ శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి ఎదురుచూసేవారు. అయితే ఇప్పుడు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కొండకు చేరిన భక్తులకు గుడ్ న్యూస్. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడా క్యూలైన్ లో ఎక్కడా వేచి ఉండకుండా నేరుగా వెళ్లిపోయేటంత ఖాళీగా ఉంది. భక్తులు స్వామివారిని చాలా ఈజీగా దర్శించుకుంటున్నారు. ఈ మేరకు శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్న టీటీడీ నో వెయిటింగ్ రూల్ ను అమలు చేస్తోంది. రద్దీ తగ్గడంతో కంపార్ట్మెంట్ లలో ఎక్కడా భక్తులు వేచి ఉండకుండా నేరుగా దర్శనానికి అనుమతిస్తోంది. ప్రస్తుతం నేరుగా స్వామివారిని దర్శించుకుంటున్నారు.

తిరుమల శ్రీవారిని ఆదివారం 85,258 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా కానుకలు రూ. 4.28 కోట్ల ఆదాయం టీటీడీకి చేరింది. వరసగా మూడు రోజుల పాటు వరుస సెలవులతో భక్తులతో కిటకిటిలాడిన తిరుమల కొండ పై ప్రస్తుతం భక్తుల రద్దీ తగ్గిపోయింది. దీంతో చాలా సులభంగా భక్తులకు టీటీడీ స్వామి వారి దర్శనాన్ని చేసుకునే వీలు కల్పించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..