Srikakulam: శ్రీముఖ లింగేశ్వరుడి చక్రస్నానం.. భక్తజన సంద్రంగా మారిన పవిత్ర వంశధార నది

దక్షిణ కాశీగా పేరుందిన శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగంలో స్వామివారి చక్ర తీర్థ స్నానం అత్యంత ఘనంగా జరిగింది. మంగళ స్నానాలు ఆచరించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. శివనామ స్మరణతో వంశధార నది తీరం మారుమోగింది.

Srikakulam: శ్రీముఖ లింగేశ్వరుడి చక్రస్నానం.. భక్తజన సంద్రంగా మారిన పవిత్ర వంశధార నది
Srimukhalingam Temple
Follow us

|

Updated on: Feb 21, 2023 | 7:13 AM

దక్షిణ కాశీగా,ప్రముఖ శైవ క్షేత్రంగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలోని శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన సోమవారం స్వామి వారి చక్రతీర్థ స్నానం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయం నుండి స్వామివారు నంది వాహనంపై దక్షిణముఖంగా బయలుదేరి ఉత్తరముఖంగా సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంశధార నదిలో మిరియాబిల్లి రేవు వద్ద స్వామివారు చేరుకున్నారు. అర్చకులు భక్త జన సందోహం మధ్య స్వామి వారికి శాస్త్రోక్తంగా చక్రతీర్ధ స్నానం నిర్వహించారు అర్చక స్వాములు.

మిరియాబిల్లి రేవులో స్వామివారికి చక్ర స్నానం ఆచరించగా దిగువున అదే నదీ తీరంలో తండోప తండోలుగా వేలాదిగా తరలి వచ్చిన భక్తులు మంగళ స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా పవిత్రమైన వంశధార… జనధారలా సాగిపోయింది. శివ నామ స్మరణతో మారు మ్రోగింది. ఉత్తరాంధ్రతో పాటు పొరుగున రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల నుండి, పొరుగు రాష్ట్రమైన ఒరిస్సా నుండి భారీగా భక్తులు తరలివచ్చారు. శ్రీముఖ లింగేశ్వరుడి చక్ర తీర్థ స్నానంతో పవిత్ర వంశధార నది ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. స్వామి వారు చక్ర తీర్థం రోజున ఆ పవిత్ర జలాలలో తాము స్నానం చేస్తే..అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని, పుణ్య ఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
Latest Articles
వర్షం మూవీలో ప్రభాస్ మేనల్లుడు గుర్తున్నాడా.. ?
వర్షం మూవీలో ప్రభాస్ మేనల్లుడు గుర్తున్నాడా.. ?
పిన్ లేకుండానే యూపీఐ చెల్లింపులు..పేటీఎంలో అందుబాటులోకి నయా ఫీచర్
పిన్ లేకుండానే యూపీఐ చెల్లింపులు..పేటీఎంలో అందుబాటులోకి నయా ఫీచర్
కదులుతున్న రైలు నుంచి పడి మరణిస్తే పరిహారం ఉంటుందా?నిబంధనలు ఏంటి?
కదులుతున్న రైలు నుంచి పడి మరణిస్తే పరిహారం ఉంటుందా?నిబంధనలు ఏంటి?
కేవైసీ విషయంలో సెబీ కీలక నిర్ణయం.. లావాదేవీలు మరింత సులభం
కేవైసీ విషయంలో సెబీ కీలక నిర్ణయం.. లావాదేవీలు మరింత సులభం
కిర్గిస్థాన్‌లో ప్రాణభయంతో వణికిపోతున్న తెలుగు విద్యార్ధులు
కిర్గిస్థాన్‌లో ప్రాణభయంతో వణికిపోతున్న తెలుగు విద్యార్ధులు
టీ20 వరల్డ్ కప్‌లో ఈ 5 రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే!
టీ20 వరల్డ్ కప్‌లో ఈ 5 రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే!
కూరల్లో ఉప్పు బాగా ఎక్కువైందా.. ఇలా చేస్తే సరి!
కూరల్లో ఉప్పు బాగా ఎక్కువైందా.. ఇలా చేస్తే సరి!
పదే పదే మిల్క్ టీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ICMR హెచ్చరిక
పదే పదే మిల్క్ టీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ICMR హెచ్చరిక
అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థులు ముగ్గురూ.. బీజేపీ వాళ్లే..?
అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థులు ముగ్గురూ.. బీజేపీ వాళ్లే..?
ఎన్నికల తర్వాత షాకివ్వనున్న టెలికం కంపెనీలు.. భారీగా పెరగనున్న...
ఎన్నికల తర్వాత షాకివ్వనున్న టెలికం కంపెనీలు.. భారీగా పెరగనున్న...