AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mantralayam: నేటి నుంచి రాఘవేంద్రుల గురు వైభవోత్సవాలు.. ఆరు రోజుల పాటు నిర్వహణ

ఈ ఉత్సవాలు శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో ఆరు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.

Mantralayam: నేటి నుంచి రాఘవేంద్రుల గురు వైభవోత్సవాలు.. ఆరు రోజుల పాటు నిర్వహణ
Guru Vaibhava Utsavalu
Surya Kala
|

Updated on: Feb 21, 2023 | 7:49 AM

Share

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం. కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో నేటి నుంచి గురుభక్తి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాలు శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో ఆరు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా మూల బృందావనానికి పంచామృతం అభిషేకాలు, విశేష పూజలు నిర్వహిస్తారు.

402 వ పట్టాభిషేకం సందర్భంగా మఠం పీఠాధిపతులు సుభుదేంద్ర తీర్థులు స్వామి వారిని పాదుకలకు నవరత్నాలు, పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రేపు (22 వ తేదీన) శ్రీ రాఘవేంద్రస్వామి 402 వ పట్టాభిషకోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. గురుభక్తి ఉత్సవాల్లో భాగంగా ఆఖరు రోజైన 26 వ తేదీన శ్రీ రాఘవేంద్రస్వామి జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు. ఈ జన్మదినంలో భాగంగా టీటీడీ నుంచి అధికారికంగా రాఘవేంద్ర స్వామికి పట్టువస్త్రాలను  సమర్పించనున్నారు. ఈరోజు స్వామివారి ప్రతిమను స్వర్ణ రథోత్సవంలో ఊరేగించనున్నారు. గురు ఉత్సవాల కోసం మంత్రాలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు.. వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు  తరలి వస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..