AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raksha Bandhan 2023: ఈసారి రాఖీ పౌర్ణమి 2 రోజులు.. సమయం 10 గంటలే! పండితులు ఏమంటున్నారంటే..

ఈ రాఖీ పౌర్ణమి అంశం పై స్పందించిన వేద పండితులు పౌర్ణమి తిథి ఆగస్టు 30, 31వ తేదీలలో ఉంది అని అందుకే చాలా మంది ఆ పౌర్ణమి తిథి ఉన్న రోజులలో పండగ జరుపుకోవాలని అని అనుకుంటున్నారని అంటున్నారు.. కానీ వేదాల సారం ప్రకారం సూర్యోదయంలో ఉన్న తిథినీ మాత్రమే మనం స్వీకరించాలని సూర్యాస్తమయంలో ఉన్న తిథి ప్రకారం పండగ జరుపుకోకూడదని పండితులు అంటున్నారు. ఈ లెక్కన ఆగస్ట్ 30, 31 తేదీల్లో పౌర్ణమితిథి ఉన్నప్పటికీ రెండు రోజులు కలిపి 10 గంటల సమయంలో మాత్రమే రాఖీ పండుగ జరుపుకోవాలని అందరూ భావిస్తున్నారు కానీ....

Raksha Bandhan 2023: ఈసారి రాఖీ పౌర్ణమి 2 రోజులు.. సమయం 10 గంటలే! పండితులు ఏమంటున్నారంటే..
Raksha Bandhan
Yellender Reddy Ramasagram
| Edited By: Srilakshmi C|

Updated on: Aug 09, 2023 | 3:01 PM

Share

హైదరాబాద్‌, ఆగస్టు 9: రాఖీ పూర్ణిమ అంటే అన్న చెల్లెలు, అక్క తమ్ములకు ఎంతో ఇష్టమైన పండగ.ప్రతి శ్రావణ మాసం లో నీ పూర్ణిమ రోజున ఈ పండగ ఎంతో ఇష్టంగా గా జరుపకుంటారు.అయితే ఈ సారి పండగ కొంత కన్ఫ్యూజన్ గా కనిపిస్తుంది. ఆగస్ట్ 30, 31 తేదీలలో రాఖీ పౌర్ణమి అని వార్తలు వస్తున్నాయి. దీంతో చాలా మంది లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది.

ఈ రాఖీ పౌర్ణమి అంశం పై స్పందించిన వేద పండితులు పౌర్ణమి తిథి ఆగస్టు 30, 31వ తేదీలలో ఉంది అని అందుకే చాలా మంది ఆ పౌర్ణమి తిథి ఉన్న రోజులలో పండగ జరుపుకోవాలని అని అనుకుంటున్నారని అంటున్నారు.. కానీ వేదాల సారం ప్రకారం సూర్యోదయంలో ఉన్న తిథినీ మాత్రమే మనం స్వీకరించాలని సూర్యాస్తమయంలో ఉన్న తిథి ప్రకారం పండగ జరుపుకోకూడదని పండితులు అంటున్నారు.

ఈ లెక్కన ఆగస్ట్ 30, 31 తేదీల్లో పౌర్ణమితిథి ఉన్నప్పటికీ రెండు రోజులు కలిపి 10 గంటల సమయంలో మాత్రమే రాఖీ పండుగ జరుపుకోవాలని అందరూ భావిస్తున్నారు కానీ…. ఆగస్టు 31వ తేదీ సూర్యోదయం పౌర్ణమి తిథి తో ప్రారంభమవుతుంది కాబట్టి ఆగస్టు 31వ తేదీ గురువారం ఉదయం తెల్లవారుజాము నుండి పౌర్ణమి తిథి పూర్తయి ఎనిమిది గంటల సమయం వరకు మాత్రమే రాఖీ పండుగ జరుపుకోవాలని ఇది అందరికీ శ్రేయస్కరమని పండితులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఆగస్టు 31వ తేదీ ఉదయం 8 గంటలకు పౌర్ణమి తిథి ముగుస్తుంది కాబట్టి ఆ తర్వాత రాఖీ పండుగ జరుపుకోవడం అంత మంచిది కాదు అనేది వేద పండితుల అభిప్రాయం.కాబట్టి ఉదయం ఎనిమిది గంటల లోపే రాఖీ పండుగ జరుపుకోవాలని పండితుల సూచన. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ముందు రోజు తన వారి వద్దకు చేరుకొని గురువారం ఉదయం 8 గంటల లోపు రాఖీ కట్టాలని పండితులు సూచిస్తున్నారు. ఆ తర్వాత వచ్చే భద్రకాలం అంతా భద్రం కాదని..కాబట్టి భద్రకాలం వచ్చే లోపే పండుగ జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.