AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ‘కళ్యాణమస్తు’ కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్.. 10 ఏళ్ల తర్వాత మళ్లీ

తిరుమల కళ్యాణమస్తు కార్యక్రమానికి ముహూర్తం ఖరారు చేసింది టీటీడీ.  పది సంవత్సరాల అనంతరం తిరిగి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. 

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. 'కళ్యాణమస్తు' కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్.. 10 ఏళ్ల తర్వాత మళ్లీ
Ram Naramaneni
|

Updated on: Feb 17, 2021 | 1:08 PM

Share

TTD News: తిరుమల కళ్యాణమస్తు కార్యక్రమానికి ముహూర్తం ఖరారు చేసింది టీటీడీ.  పది సంవత్సరాల అనంతరం తిరిగి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా కళ్యాణమస్తు పేరుతో సామూహిక వివాహాలు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది.  తిరుమలలోని నాదనీరాజనం వేదికపై  అర్చకులు ముహూర్తం ఖరారు చేశారు.

ఈ సంవత్సరం మే 28  మధ్యాహ్నం 12.34  నుంచి 12:40 వరకు, అక్టోబర్ 30 ఉదయం 11:04 నుంచి 11:08  వరకు,  నవంబర్ 17 ఉదయం 9:56 నుంచి 10.02 వరకు ముహూర్తాలు ఖరారు చేశారు. పాలకమండలిలో చర్చించి కళ్యాణమస్తు  వేదికలను నిర్ణయిస్తామని టీటీడీ ఈఓ జవహార్ రెడ్డి తెలిపారు.  కళ్యాణమస్తు కార్యక్రమం ద్వారా వివాహం చేసుకున్న వారికి  మంగళసూత్రం, నూతన వస్త్రాలు, 40 మందికి అన్నప్రసాదం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

Also Read:

Miss India 2020 Runner-up Manya Singh: మిస్ ఇండియా రన్నరప్.. కేరాఫ్ ఆటోవాలా కూతురు.. వాటే స్టోరీ

విద్యుత్ సంస్కరణలపై ఏపీ సర్కార్ తొలి విజయం.. కరెంట్ బిల్లు నిర్ణయించే అధికారం రాష్ట్రాలదే..!

 పక్షి రెట్టలతో కాఫీ.. టేస్ట్‌లో ఎవరెస్ట్.. ఈ కాఫీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ మీ కోసం