AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yadagiri Gutta: యాదాగీరిశుడికి వృద్ధ దంపతులు పరమ భక్తులు.. తమ సంపాదనలో కోట్ల ఆస్తిని నరసింహుడికి భూరి విరాళం

హనుమంతరావు ఇంజనీర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన ఇద్దరు కొడుకులు సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నారు. ఒకరు హైదరాబాదులో ఉండగా, మరొకరు అమెరికాలో స్థిరపడ్డారు. ఈ దంపతులు రామా.. కృష్ణ అంటూ శేష జీవితాన్ని సాగిస్తున్నారు. కోట్లాది మందికి ఇంటి ఇలవేల్పుగా ఉన్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారికి తమ సంపాదనలో కొంత విరాళంగా ఇవ్వాలని భావించారు. హైదరాబాద్ చైతన్యపురిలో వీరికి 260 గజాల్లో మూడంతస్తుల భవనం ఉంది.

Yadagiri Gutta: యాదాగీరిశుడికి వృద్ధ దంపతులు పరమ భక్తులు.. తమ సంపాదనలో కోట్ల ఆస్తిని నరసింహుడికి భూరి విరాళం
Yadagiri Lakshmi Narasimha Swam Y
M Revan Reddy
| Edited By: |

Updated on: Feb 28, 2024 | 7:13 AM

Share

తెలంగాణ ప్రజల ఇలవేల్పు ఏకశిఖర వాసుడు పాంచ నర్సింహుడికి భక్తులు మొక్కులు చెల్లించుకోవడం సాధారణమే. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వృద్ధ దంపతులు మూడు కోట్ల రూపాయల విలువైన భవనాన్ని విరాళంగా ఇచ్చారు.

హైదరాబాద్ చైతన్యపురికి చెందిన శారదా హనుమంతరావు దంపతులు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి పరమ భక్తులు. ఇంటి ఇలవేల్పుగా ఉన్న యాదగీరిశుడికి కోరికలు తీరిన వెంటనే మొక్కులు చెల్లించుకునేవారు. హనుమంతరావు ఇంజనీర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన ఇద్దరు కొడుకులు సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నారు. ఒకరు హైదరాబాదులో ఉండగా, మరొకరు అమెరికాలో స్థిరపడ్డారు. ఈ దంపతులు రామా.. కృష్ణ అంటూ శేష జీవితాన్ని సాగిస్తున్నారు.

కోట్లాది మందికి ఇంటి ఇలవేల్పుగా ఉన్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారికి తమ సంపాదనలో కొంత విరాళంగా ఇవ్వాలని భావించారు. హైదరాబాద్ చైతన్యపురిలో వీరికి 260 గజాల్లో మూడంతస్తుల భవనం ఉంది. మూడు కోట్ల రూపాయల విలువ చేసే ఈ భవనాన్ని శారద హనుమంతరావు దంపతులు స్వామివారికి విరాళంగా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

చైతన్యపురిలోని భవనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను యాదగిరిగుట్ట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్వామి వారి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఈ రిజిస్ట్రేషన్ పత్రాలను ఆలయ ఈవో రామకృష్ణారావుకు అందజేశారు. దీంతో యాదగిరిగుట్ట దేవస్థాన అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈవో ఎం. రామకృష్ణారావు భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూడు కోట్ల రూపాయల విలువైన భవనాన్ని స్వామివారికి విరాళంగా ఇవ్వడం పట్ల శారదా హనుమంతరావు దంపతులను ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదంతో సత్కరించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ