AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala Rush: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం..

శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 24 కంపార్ట్‌మెంట్లలో బారులు తీరారు. ఎటువంటి టికెట్లు లేకుండా సర్వదర్శనంకు భక్తులు క్యూలో బారులు తీరారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనం కోసం సుమారు 18 గంటలు పడుతుంది. రూ.300  ప్రత్యేక దర్శనంలో భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 4 గంటలు పడుతుంది.  భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అందుకు తగిన ఏర్పాట్లను టీటీడీ అధికారులు చేశారు. 

Tirumala Rush: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం..
Tirumala Rush
Surya Kala
|

Updated on: Jan 27, 2024 | 10:49 AM

Share

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం దేశ విదేశాలా నుంచి భారీ సంఖ్యలో తిరుమల తిరుపతి క్షేత్రానికి  చేరుకుంటారు. రిపబ్లిక్ డే, శనివారం, ఆదివారం ఇలా వరసగా మూడు రోజులు  సెలవులతో తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తులతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 24 కంపార్ట్‌మెంట్లలో బారులు తీరారు. ఎటువంటి టికెట్లు లేకుండా సర్వదర్శనంకు భక్తులు క్యూలో బారులు తీరారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనం కోసం సుమారు 18 గంటలు పడుతుంది. రూ.300  ప్రత్యేక దర్శనంలో భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 4 గంటలు పడుతుంది.  భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అందుకు తగిన ఏర్పాట్లను టీటీడీ అధికారులు చేశారు.

శుక్రవారం స్వామివారిని 71,664 మంది భక్తులు దర్శించుకున్నారు.  33,330 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లు వచ్చిందని టీటీడీ సిబ్బంది తెలిపారు. .

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి