AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్షయ తృతీయ రోజున తులసితో ఇలా పూజించండి.. లక్ష్మీదేవి అనుగ్రహంతో కోరిన కోర్కెలు నెరవేతాయి

వైశాఖ శుక్ల తృతీయ తిథి మే 10వ తేదీ 2024 ఉదయం 04:17 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో  ఈ తిధి మే 11వ తేదీ తెల్లవారుజామున 02:50 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో, అక్షయ తృతీయ పండుగను మే 10 శుక్రవారం జరుపుకుంటారు. ఈ రోజు ఉదయం 05:33 గంటల నుంచి  మధ్యాహ్నం 12:18 గంటల వరకు పూజా సమయం శుభ ప్రదంగా ఉంటుంది.

అక్షయ తృతీయ రోజున తులసితో ఇలా పూజించండి.. లక్ష్మీదేవి అనుగ్రహంతో కోరిన కోర్కెలు నెరవేతాయి
Akshaya Tritiya Tulasi Puja
Surya Kala
|

Updated on: May 08, 2024 | 10:23 AM

Share

పంచాంగం ప్రకారం అక్షయ తృతీయ పండగను ఈ ఏడాది శుక్రవారం మే 10, 2024 సంవత్సరంలో జరుపుకుంటారు. అక్షయ తృతీయను పవిత్రమైన శుభ సమయంగా పరిగణిస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడం కూడా శుభప్రదమని నమ్మకం. దీనితో పాటు అక్షయ తృతీయ రోజున తులసికి సంబంధించిన కొన్ని నియమాలు పూజాది కార్యక్రమాలను కూడా ప్రస్తావించబడ్డాయి. ఇలా చేయడం వలన జీవితంలో శుభ ఫలితాలను పొందవచ్చు.

అక్షయ తృతీయ శుభ ముహూర్తం

వైశాఖ శుక్ల తృతీయ తిథి మే 10వ తేదీ 2024 ఉదయం 04:17 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో  ఈ తిధి మే 11వ తేదీ తెల్లవారుజామున 02:50 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో, అక్షయ తృతీయ పండుగను మే 10 శుక్రవారం జరుపుకుంటారు. ఈ రోజు ఉదయం 05:33 గంటల నుంచి  మధ్యాహ్నం 12:18 గంటల వరకు పూజా సమయం శుభ ప్రదంగా ఉంటుంది.

తులసితో ప్రత్యేక ప్రయోజనాలను పొందాలంటే

తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని భావిస్తారు. అటువంటి పరిస్థితిలో అక్షయ తృతీయ రోజున ఇంట్లో కొత్త తులసి మొక్కను నాటవచ్చు. ఈ రోజున ఖచ్చితంగా తులసిని పూజించండి. సాయంత్రం సమయంలో  తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించండి. ఇలా చేయడం ద్వారా వ్యక్తి డబ్బు, ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ప్రతి కోరిక నెరవేరుతుంది

ఇవి కూడా చదవండి

తులసి మహావిష్ణువుకు చాలా ప్రియమైనదిగా పరిగణించబడుతుంది. తులసి దళం లేని నైవేద్యం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా విష్ణువుకి సమర్పించే నైవేద్యంలో తులసి దళాలను జోడించండి. ఇలా చేయడం వల్ల శ్రీమహావిష్ణువు ప్రసన్నుడై సాధకుడి కోరికలన్నీ తీరుస్తాడు. ఖచ్చితంగా ఈ పని చేయండి

అక్షయ తృతీయ రోజున ఆలయానికి వెళ్లి విష్ణువుకు పసుపు పువ్వులతో పాటు కొన్ని తులసి దళాలను  సమర్పించండి. ఇలా చేయడం వల్ల విష్ణువు , లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందుతారు. దీని కారణంగా ఆర్థిక  లాభాలు అందుకోవచ్చు. దీనితో పాటు అక్షయ తృతీయ రోజున తులసి దళంపై స్వస్తిక చిహ్నాన్ని వేసి, పూజలో తులసి ను సమర్పించి ధూపం, దీపం, సువాసన, పువ్వులు మొదలైనవి సమర్పించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు