వివేకా హత్య కేసు: నిందితులకు రిమాండ్ పొడిగింపు
పులివెందుల: ఎన్నికలకు ముందు సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. ఈ హత్యకేసులో అరెస్టైన ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్లను పులివెందులలోని జూనియర్ సివిల్ కోర్టులో పోలీసులు సోమవారం హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు జడ్జి అశోక్ కుమార్ నిందితులకు జూన్ 3 వరకు రిమాండ్ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే, కడపలోని సెంట్రల్ జైల్ నుంచి పులివెందులలోని సబ్ జైలుకు తమను తరలించాలని […]
పులివెందుల: ఎన్నికలకు ముందు సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. ఈ హత్యకేసులో అరెస్టైన ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్లను పులివెందులలోని జూనియర్ సివిల్ కోర్టులో పోలీసులు సోమవారం హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు జడ్జి అశోక్ కుమార్ నిందితులకు జూన్ 3 వరకు రిమాండ్ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే, కడపలోని సెంట్రల్ జైల్ నుంచి పులివెందులలోని సబ్ జైలుకు తమను తరలించాలని నిందితులు పెట్టుకున్న పిటిషన్పై న్యాయమూర్తి విచారించారు. వారి అభ్యర్థనను పరిగణలోని తీసుకున్న కోర్టు.. ముగ్గురు నిందితుల్ని పులివెందులలోని సబ్ జైలుకు తరలించాలని ఆదేశించింది.