వైఎస్సార్ పేరు తొలగించాలని.. కాగడాల ప్రదర్శన..!

విశాఖ సౌత్‌లో టీడీపీ నేతలు కాగడాల ప్రదర్శన చేశారు. ఇక్కడ ఉన్న సెంట్రల్ పార్క్ పేరును మార్చి ‘వైఎస్‌ఆర్’ పేరు పెట్టడాన్ని తప్పుబట్టారు. ఎంతో కష్టంతో ఎన్నో కోట్లు ఖర్చు చేసి ‘చంద్రబాబు’ ఈ పార్క్‌ను కట్టిస్తే.. ‘వైఎస్‌ఆర్’ పేరు ఎలా పెడతారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పాత పేరు కొనసాగించాలని బ్యానర్లు పట్టుకొని కాగడాల ప్రదర్శన చేశారు. విశాఖలో సెంట్రల్ పార్కు పేరును వైఎస్‌ఆర్ సెంట్రల్ పార్కుగా మార్చారు. మంత్రలు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ […]

వైఎస్సార్ పేరు తొలగించాలని.. కాగడాల ప్రదర్శన..!
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 09, 2019 | 12:54 PM

విశాఖ సౌత్‌లో టీడీపీ నేతలు కాగడాల ప్రదర్శన చేశారు. ఇక్కడ ఉన్న సెంట్రల్ పార్క్ పేరును మార్చి ‘వైఎస్‌ఆర్’ పేరు పెట్టడాన్ని తప్పుబట్టారు. ఎంతో కష్టంతో ఎన్నో కోట్లు ఖర్చు చేసి ‘చంద్రబాబు’ ఈ పార్క్‌ను కట్టిస్తే.. ‘వైఎస్‌ఆర్’ పేరు ఎలా పెడతారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పాత పేరు కొనసాగించాలని బ్యానర్లు పట్టుకొని కాగడాల ప్రదర్శన చేశారు.

విశాఖలో సెంట్రల్ పార్కు పేరును వైఎస్‌ఆర్ సెంట్రల్ పార్కుగా మార్చారు. మంత్రలు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ కొత్తపేరుతో ఉన్న శిలాఫలకాన్ని ప్రారంభించారు. సెప్టెంబర్ 2 వైఎస్ఆర్ వర్ధంతి నాటికి పార్కులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రులు తెలిపారు.