AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: అమూల్ ప్లాంట్‌కు శంకుస్ధాపన చేయనున్న ప్రధాని నరేంద్రమోడీ.. దాదాపు లక్ష మందికి ఉపాధి..

PM Modi: రైతుల ఉపాధి, ఆదాయాలను రెట్టింపు చేసేందుకు పూర్వాంచల్‌లో అమూల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్లాంట్‌ దాదాపు ఒకటిన్నర

PM Modi: అమూల్ ప్లాంట్‌కు శంకుస్ధాపన చేయనున్న ప్రధాని నరేంద్రమోడీ.. దాదాపు లక్ష మందికి ఉపాధి..
Pm Modi
uppula Raju
| Edited By: Ravi Kiran|

Updated on: Dec 22, 2021 | 6:56 AM

Share

PM Modi: రైతుల ఉపాధి, ఆదాయాలను రెట్టింపు చేసేందుకు పూర్వాంచల్‌లో అమూల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్లాంట్‌ దాదాపు ఒకటిన్నర నుంచి రెండేళ్లలో సిద్ధమవుతుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు లక్ష మందికి ఉపాధి లభించనుంది. దీంతో రైతుల ఆరోగ్యం, ఆదాయం రెండూ మెరుగుపడతాయి. డిసెంబర్ 23న పింద్రా బ్లాక్‌లోని కార్ఖియాన్వ్‌లో నిర్మించనున్నఅమూల్ ప్లాంట్‌కి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారు. 475 కోట్లతో బనాస్ కాశీ సంకుల్ ప్రాజెక్టు కింద దీన్ని నిర్మిస్తున్నారు.

డిసెంబర్ 23న వారణాసి పర్యటన సందర్భంగా ప్రధాని బహిరంగ సభ నిర్వహించి యూపీలోని 1.74 లక్షల మంది పాల ఉత్పత్తిదారులకు రూ.3519 కోట్ల బోనస్‌ను విడుదల చేస్తారు. వారణాసిలోని పింద్రా బ్లాక్‌లోని పారిశ్రామిక ప్రాంతమైన కర్ఖియాన్వ్‌లో యోగి ప్రభుత్వం అమూల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుంది. అమూల్ కాశీ సంకుల్ ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగ్రామ్ చౌదరి మాట్లాడుతూ.. పూర్వాంచల్‌లోని పది జిల్లాల ప్రజలు ఈ ప్లాంట్ ద్వారా ప్రయోజనం పొందుతారని చెప్పారు. 30 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్లాంట్‌లో రోజుకు ఐదు లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతాయి.

ఫ్యాక్టరీలో 750 మందికి ఉద్యోగాలు ఈ ఫ్యాక్టరీలో దాదాపు 750 మందికి ప్రత్యక్షంగా, 2,350 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. పూర్వాంచల్, గోపాల్‌కో రైతులతో సహా దాదాపు లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. 120 కిలోమీటర్ల పరిధిలో చిల్లింగ్ సెంటర్ ఓపెన్ అవుతుంది. కంపెనీ ప్రతి గ్రామంలో పాల సేకరణ కేంద్రాలను ప్రారంభించనుంది. ఇందుకోసం ప్రతి గ్రామంలో పాల కొనుగోలు కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఇది ప్రామాణిక ఆపరేటింగ్ విధానంలో పాలను కొనుగోలు చేస్తుంది. నిర్ణీత సమయంలో కంపెనీ వాహనం నుంచి పాలు సేకరిస్తారు. ఈ ప్లాంట్ ప్రారంభంతో తలసరి ఆదాయం పెరుగుతుంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఇది దోహదపడుతుంది. ఈ ప్లాంట్‌లో పాలే కాకుండా ఐస్‌క్రీం, పనీర్, ఖోవా, నెయ్యి, వెన్న కూడా ఉత్పత్తి చేస్తారు.

1.74 లక్షల మంది పాల ఉత్పత్తిదారులకు బోనస్ డిసెంబర్ 23న కార్ఖియాన్వ్‌లో బహిరంగ సభ నిర్వహించడంతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని 1.74 లక్షల మంది పాల ఉత్పత్తిదారులకు ఆన్‌లైన్‌లో రూ. 35.19 కోట్ల బోనస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బదిలీ చేస్తారు. కంపెనీ తన లాభం నుంచి రైతులకు బోనస్ ఇవ్వడం కొనసాగిస్తుంది. భవిష్యత్తులో, కంపెనీ మంచి జాతుల జంతువులకు కృత్రిమ గర్భధారణను ఏర్పాటుకు కృషి చేస్తుంది. ఇది మరింత పాల ఉత్పత్తిని పెంచుతుంది. కంపెనీ పాల ఉత్పత్తిదారులకు నాణ్యమైన పశుగ్రాసాన్ని కూడా అందిస్తుంది.

బూస్టర్‌ డోస్‌ తీసుకుంటే రూ.7500 నగదు బహుమతి..! ఈ ఆఫర్ డిసెంబర్‌ 31లోపు మాత్రమే..?

’83’ సినిమాపై పన్ను మినహాయింపు.. సినీ ప్రేమికులకు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ గిఫ్ట్‌

ఆధార్‌ కార్డుతో ఓటర్‌ ఐడి లింక్‌ చేస్తే ప్రయోజనాలేమిటి..? ప్రభుత్వం ప్రతిపాదించే కొత్త బిల్లు గురించి తెలుసుకోండి..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..