జనసేనకు 20 శాతానికి పైగా ఓట్లు!

జనసేనకు సైలెంట్ ఓటింగ్ జరిగిందని, మే 23న తమ సత్తా ఏంటో తెలుస్తుందని.. ఈ ఎగ్జిట్ పోల్స్‌కు అందని రీతిలో జనాలు తమకు ఓటేశారని చాలా మంది జనసైనికులు ఇప్పటికీ నమ్మకంగా ఉన్నారు. ఏపీ ఎన్నికలపై జనసేన ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుందని సీ-ఓటర్ ఇండియా సర్వే పరోక్షంగా వెల్లడించింది. టీడీపీకి 36.5 శాతం ఓట్లు, వైఎస్ఆర్సీపీకి 34.9 శాతం ఓట్లు పడ్డాయని సీ-ఓటర్ ఇండియా అంచనా వేసింది. మరి మిగతా ఓట్ల శాతం సంగతేంటని అనుకుంటున్నారా? కాంగ్రెస్‌కు […]

జనసేనకు 20 శాతానికి పైగా ఓట్లు!
Follow us

| Edited By:

Updated on: May 22, 2019 | 9:06 PM

జనసేనకు సైలెంట్ ఓటింగ్ జరిగిందని, మే 23న తమ సత్తా ఏంటో తెలుస్తుందని.. ఈ ఎగ్జిట్ పోల్స్‌కు అందని రీతిలో జనాలు తమకు ఓటేశారని చాలా మంది జనసైనికులు ఇప్పటికీ నమ్మకంగా ఉన్నారు.

ఏపీ ఎన్నికలపై జనసేన ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుందని సీ-ఓటర్ ఇండియా సర్వే పరోక్షంగా వెల్లడించింది. టీడీపీకి 36.5 శాతం ఓట్లు, వైఎస్ఆర్సీపీకి 34.9 శాతం ఓట్లు పడ్డాయని సీ-ఓటర్ ఇండియా అంచనా వేసింది. మరి మిగతా ఓట్ల శాతం సంగతేంటని అనుకుంటున్నారా? కాంగ్రెస్‌కు 2.2 శాతం, బీజేపీకి 1.5 శాతం ఓట్లు పడ్డాయట. 24.9 శాతం ఓట్లు ఇతరులకు మళ్లాయని ఆ సీఓటర్ అభిప్రాయపడింది. అంటే జనసేన, దాని భాగస్వామ్య పక్షాలు ప్లస్ ఇండిపెండెంట్లకు అన్నమాట. సీ-ఓటర్ ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం జనసేనకు 20 శాతానికిపైగా ఓట్లు పడ్డాయి.

మిగతా ఎగ్జిట్ పోల్స్‌లో జనసేన ప్రస్తావనే లేని పరిస్థితుల్లో సీ-ఓటర్ ఇండియా సర్వే జనసైనికుల్లో ఆశలు రేపుతోంది. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన పార్టీ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.