- Telugu News Photo Gallery World photos Vishwa Hindu Parishad organizes Ram Ratha Yatra to Unite Hindus in America and Canada
అయోధ్య బాలరాముని ఖ్యాతిని విదేశాలకు విస్తరింపజేసిన VHP.. హిందువుల కోసం ప్రతిష్ఠాత్మక కార్యక్రమం..
అయోధ్య బాలరాముని శోభను భారతదేశంలోనే కాకుండా విదేశాలకు కూడా విస్తరింపజేస్తున్నారు. ఈ మహాయజ్ఙంలో విశ్వహిందూ పరిషత్ కీలక భూమిక పోషిస్తోంది. అమెరికా, కెనడాకు చెందిన విశ్వహిందూ పరిషత్ సభ్యులు శ్రీరాముని రథయాత్రను ఘనంగా నిర్వహించేందుకు సంకల్పించారు.
Srikar T |
Updated on: Mar 27, 2024 | 5:54 PM

అయోధ్య బాలరాముని శోభను భారతదేశంలోనే కాకుండా విదేశాలకు కూడా విస్తరింపజేస్తున్నారు. ఈ మహాయజ్ఙంలో విశ్వహిందూ పరిషత్ కీలక భూమిక పోషిస్తోంది. అమెరికా, కెనడాకు చెందిన విశ్వహిందూ పరిషత్ సభ్యులు శ్రీరాముని రథయాత్రను ఘనంగా నిర్వహించేందుకు సంకల్పించారు.

వీరి నేతృత్వంలో ఉత్తర అమెరికాలోని హిందూ డయాస్పోరా అనే ప్రాంతంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక కీలకమైన ఘట్టాన్ని ఆవిష్కరించారు. బాల రామునికి సంబంధిచిన చిత్రపటాన్ని ప్రత్యేక పూజలతో ఏర్పాటు చేసిన కలశాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు.

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఐక్యత, భక్తి విశ్వాసం, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు. యునైటెడ్ స్టేట్స్, కెనడాలో నివసించే హిందూ భక్తులను ఐక్యం చేసుకుంటూ వీరందరిలో భక్తిభావాన్ని నింపుకుంటూ ఈ యాత్ర సాగింది.

భారతదేశానికి దూరంగా నివసిస్తున్న హిందువుల మధ్య సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడం కోసం ఈ ప్రత్యేక సమ్మేళనాన్ని విశ్వహిందూ పరిషత్ భుజానికెత్తుకుంది. మార్చి 25న, ఈ యాత్ర ప్రారంభించినట్లు తెలిపారు.

ఈ ఆధ్యాత్మిక, భక్తిభావంతో కూడిన ప్రయాణంలో ఇండియానా-సౌత్ బెండ్లోని ఒక ఆలయాన్ని, మిచిగాన్లోని ఏడు ఆలయాలను.. ఓహియో ప్రాంతంలోని బౌలింగ్ గ్రీన్ దుర్గా ఆలయాన్ని సందర్శించుకుంటూ సాగింది. ప్రవాస భారతీయ హిందువులలో మతపరమైన భావాన్ని కలిగించడానికి ప్రయత్నించారు ఈ సంస్థ ప్రతినిధులు.

భారతదేశంలోని అయోధ్య లాంటి పుణ్య పవిత్ర స్థలాలను సందర్శించనప్పటికీ, ఈ కార్యక్రమం ద్వారా అంతకు సమానమైన సాంత్వన, ఆధ్యాత్మిక చింతన చేకూరిందని అందులో పాల్గొన్న భారతీయులు తెలిపారు.





























